Virupaksha: ఈ బ్లాక్ బస్టర్ ఛాన్స్ మిస్ చేసుకున్న హీరో ?

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా సినిమా ‘విరూపాక్ష’. కార్తీక దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. యాక్సిడెంట్ తర్వాత నటించిన ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ సాధించడంతో సాయి ధరమ్ తేజ్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

ఈ నేపథ్యంలోనే ‘విరూపాక్ష’ సీక్వెల్ పై జోరుగా చర్చ నడుస్తోంది. ఇది ఇలా ఉండగా, నిజానికి ఈ సినిమాను సుకుమార్ రాసుకున్నప్పుడు మొదట అనుకున్న హీరో టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న నిఖిల్. ఈ కథ రాసుకున్నప్పుడు ఈ కథలో హీరోగా నిఖిల్ అయితే బాగుంటాడు అంటూ సుకుమార్ అనుకున్నారట. అయితే ఈ కథను వివరించగా నిఖిల్ ఈ కథను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు కార్తికేయ 1, కార్తికేయ 2 ఇంచుమించు కథలు ఇలానే ఉంటాయి.

మళ్లీ అదే జోనర్ లో కథలు తీస్తే తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అన్న కారణంతోనే నిఖిల్ కథ నచ్చినా, ఈ సినిమా రిజెక్ట్ చేశాడట. కాగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సుకుమార్ పథకాలపై బాపినీడు బి సమర్పణలో బివిఎస్ఎన్ ప్రసాద్ విరూపాక్ష సినిమాను నిర్మించారు. సంయుక్తమీనన్ హీరోయిన్ గా చేసింది. బైక్ యాక్సిడెంట్ అయిన తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన తొలి చిత్రం విరూపాక్ష కావడంతో అభిమానులలో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు