త్రిష కృష్ణన్… మూడు పదుల వయసు దాటుతున్న ఈ భామ అందం మాత్రం చెక్కుచెదరడం లేదు. ఎవర్ గ్రీన్ బ్యూటీల రోజు రోజుకు అందంగా తయారవుతోంది. యంగ్ హీరోయిన్లకు స్ట్రాంగ్ పోటీనిస్తుంది. ఈ బ్యూటీ క్యూట్ స్మైల్… మెస్మరైజింగ్ చామ్ కుర్రాలను కట్టిపడేస్తున్నాయి. పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
ఇది ఇలా ఉండగా, కొన్ని రోజులుగా త్రిష పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోతుందని కూడా వార్తలు వచ్చాయి. అలాంటి ఈ భామ బిజినెస్ మాన్ వరుణ్ మానియన్ తో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ కూడా చాలా గ్రాండ్ గా చేసుకుంది. అయితే అనుకోకుండా ఇద్దరి మధ్య దూరం పెరిగి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. వీళ్ళ నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వడానికి ప్రముఖ హీరో రజనీకాంత్ అల్లుడు ధనుష్ కారణమట.
త్రిష తన ఎంగేజ్మెంట్ కి తెలుగు, తమిళ ఇండస్ట్రీ నుండి చాలామంది సెలబ్రిటీలకు ఆహ్వానం పంపించింది. అందులో భాగంగానే ధనుష్ నీ కూడా త్రిష ఆహ్వానించింది. కానీ ధనుష్ వారి ఎంగేజ్మెంట్ కి రావడం త్రిషకి కాబోయే భర్త వరుణ్ కి అసలు ఇష్టం లేదు. ఎందుకంటే అప్పటికే ధనుష్ తో వరుణ్ కి ఓ విషయంలో గొడవ జరిగింది. తనతో గొడవ పడిన వ్యక్తిని ఎలా పిలిచావని త్రిషకు కాబోయే భర్త ఆమెను నిలదీశాడు. ఇక ఈ విషయంలోనే వారిద్దరికీ గొడవ అయిందని, అందుకే త్రిషకు పెళ్లిపై విరక్తి వచ్చిందని… ఇక పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుందని నెటిజన్లు అనుకుంటున్నారు.
For More Updates :
Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News