Sai Dharam Tej: విరూపాక్ష డైరెక్టర్ ఎంతైన అదృష్టవంతుడు భయ్యా

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 100 కోట్ల కలెక్షన్స్ తో సంచలన విజయాన్ని సాధించింది.

సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించగా, సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు. ఎస్విసిసి బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. పోయిన ఏప్రిల్21 న రిలీజైన ఈ సినిమా అటు ప్రేక్షకుల నుంచి ఇటు విమర్శకుల నుంచి ప్రశంషలు అందుకుంది.

మొదటి సినిమాకే 100 కోట్ల కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కార్తీక్ దండుకు విరూపాక్ష ప్రొడ్యూసర్స్ బెంజ్ కార్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. గతంలో సినిమా ప్రమోషన్స్ ఈ డైరెక్టర్ ఆయన ఫోన్ పోగొట్టుకోగా హీరోయిన్ సంయుక్త మీనన్ కార్తీక్ కు ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వగా, ఇప్పుడెమో ప్రొడ్యూసర్ బెంజ్ కార్ గిఫ్ట్ గా ఇచ్చారు.

- Advertisement -

దాంతో కార్తీక్ దండు ను సోషల్ మీడియాలో నెటిజన్లంతా ఎంతైనా నువ్వు అదృష్టవంతుడివి భయ్యా నువ్వు అంటూ కామెంట్ చేస్తూ,  ఈ యంగ్ డైరెక్టర్ కు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక విరూపాక్ష సినిమాకి సీక్వెల్ గా పార్ట్ 2 వస్తుందని, సినిమాలో ఎండింగ్ లో హింట్ ఇవ్వగా, దీనిపై అఫీషియల్ ఎనౌన్స్ తొందర్లోనే రాబోతుందని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు