Vijay : దీపావళికి మరో ట్రీట్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నుంచి లేటెస్ట్ గా వస్తున్న చిత్రం వారిసు. తెలుగులో వారసుడు గా తెర‌కెక్కుతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్నిశ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. అలాగే వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్ సోలమాన్ కలిసి కథను అందించారు. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తుంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

వచ్చే ఏడాది సంక్రాంతికి తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. కాగా ఈ చిత్రం అనౌన్స్ మెంట్ వచ్చిన నాటి నుంచి పెద్ద అప్డేట్స్ ఏమీ రాలేదు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విజయ్ కి సంబంధించిన రెండు పోస్టర్లను మాత్రమే విడుదల చేశారు. సగానికి పైగా షూటింగ్ పూర్తి అయినా.. అప్డేట్స్ ఇవ్వడం లేదని ఫ్యాన్స్ కొంత వరకు అసంతృప్తి తో ఉన్నారు.

ఇది ఇలా ఉండగా దీపావళికి ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ను దీపావళికి విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వెల్లడించారు. ఇది ఇలా ఉండగా, ఈ చిత్రంలో విజయ్, రష్మిక మందన్నా తో పాటు ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, యోగి బాబు, జయసుధ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే మెగా 154, ఎన్బీకే 107 వంటి సినిమాల నుంచి దీపావళికి అప్డేట్స్ రాబోతున్నాయి. ఇప్పుడు విజయ్ వారసుడు నుంచి కూడా అప్డేట్ వస్తుందని స్పష్టం తెలుస్తుంది. దీంతో సినీ లవర్స్ దీపావళి సినీ పండగ వాతావరణం ఉండటం ఖాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు