Venu Swami: ఈ ఏడాది కచ్చితంగా ఈ స్టార్ కపుల్స్ విడిపోతారు..!

గత కొన్నేళ్లుగా సెలబ్రిటీల జాతకాలతో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఫేమస్ అయ్యారు. సినీ సెలబ్రిటీలకు సంబంధించిన జ్యోతిష్యం చెబుతూ మంచి పాపులారిటీ దక్కించుకున్నారు వేణు స్వామి. ముఖ్యంగా అప్పట్లో నాగచైతన్య – సమంత వివాహం తర్వాత ఎక్కువ కాలం కలిసి ఉండలేరని చెప్పి ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.

ఆ తరువాత నుండి ఈయన ఎక్కడ ఏ కామెంట్ చేసినా అవి వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈయన జ్యోతిష్యం చెప్పడంతో పాటు సెలబ్రిటీల ఇళ్లల్లో పూజలు, యాగాలు కూడా నిర్వహిస్తుంటారు. ఇప్పటికే రష్మిక మందన్న, నిధి అగర్వాల్, డింపుల్ హయాతి వంటి హీరోయిన్లకి పూజలు, యాగాలు కూడా నిర్వహించారు. అలాంటి వేణు స్వామి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రెడిక్షన్ షేర్ చేశారు. గతంలో నాగచైతన్య – సమంత ఎలా అయితే విడిపోయారో ఇప్పుడు మరో జెంట కూడా ఈ ఏడాది విడాకులు తీసుకుంటుందని సంచల వ్యాఖ్యలు చేశారు.

ఆ జంట మరెవరో కాదు.. బాలీవుడ్ క్యూట్ కపుల్ ఐశ్వర్య రాయ్ – అభిషేక్ బచ్చన్. ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట ఈ మధ్య ఎక్కువగా కలిసి కనిపించడం లేదు. చాలా కార్యక్రమాలకు, పార్టీలకు ఐశ్వర్య ఒంటరిగానో, లేక కూతురిని తీసుకొనో వెళుతుంది. కానీ భర్త అభిషేక్ తో మాత్రం కనిపించడం లేదు. ఇటీవల ముంబైలో జరిగిన నితా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంచ్ ఈవెంట్ కి కూడా ఐశ్వర్య తన కూతురితో కలిసి వెళ్ళింది. వీరి వెంట అభిషేక్ మాత్రం కనిపించలేదు.

- Advertisement -

దీంతో వీరు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వైరల్ గా మారాయి. గతంలో కూడా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, దూరంగా ఉంటున్నాడని వార్తలు వచ్చిన నేపథ్యంలో అభిషేక్ ఈ వార్తలను తీవ్రంగా ఖండించారు. అయితే వీరి విడాకులు గురించి ఇప్పుడు వేణు స్వామి చెప్పడంతో ఈ న్యూస్ మళ్లీ తెరపైకి వచ్చింది. మరి వేణు స్వామి కామెంట్స్ పై అభిషేక్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు