Hbd varalaxmi: వరలక్ష్మి శరత్ కుమార్ గురించి తెలియని విషయాలివే..!!

టాలీవుడ్ , బాలీవుడ్ లో తన నటనతో ఎంతోమందిని మెస్మరైజ్ చేసింది హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్.. అయితే హీరోయిన్ గా ఎక్కువ సినిమాలు సక్సెస్ కాలేకపోవడంతో లేడీ విలన్ గా ఎంట్రీ ఇచ్చి భారీ విజయాలను అందుకుంది.. వరలక్ష్మి శరత్ కుమార్ సినిమాలలో నటించిందంటే కచ్చితంగా ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటుందనే విధంగా పేరు కూడా సంపాదించింది. ఈ రోజున వరలక్ష్మి శరత్ కుమార్ 38వ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. వాటి గురించి తెలుసుకుందాం..

వరలక్ష్మి ఎడ్యుకేషన్ డీటెయిల్స్:
వరలక్ష్మి శరత్ కుమార్ ఎవరో కాదు సీనియర్ నటుడు శరత్ కుమార్ మొదటి భార్య ఛాయ కుమార్తె.. వరలక్ష్మి చదువునంతా చెన్నైలోని సెయింట్ మైకేల్స్ లో పూర్తి చేసింది.. అలాగే అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్ లో నటనలో శిక్షణ కూడా తీసుకుంది..

హీరోయిన్ గా మిస్ చేసుకున్న చిత్రాలు..
ముందుగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాతో వరలక్ష్మి శరత్ కుమార్ ఎంట్రీ ఇవ్వాలనుకుందట.. అప్పుడు తన తండ్రి వద్దనడంతో ఆఫర్ ను మిస్ చేసుకుని.. ఆ పాత్రలో జెనీలియా నటించి మంచి క్రేజ్ అందుకుంది.. ఆ తర్వాత బాలాజీ శక్తి వేల్, కాదల్ లో కూడా అవకాశాలు బానే వచ్చాయట అవన్నీ కూడా మిస్ చేసుకుంది వరలక్ష్మి.. ఆ వెంటనే డైరెక్టర్ వెంకట్రావు దర్శకత్వంలో సరోజా అనే చిత్రంలో కూడా అవకాశం వచ్చినా నటించలేక పోయిందట.. ఇక చివరికి వరలక్ష్మి శరత్ కుమార్ పాడ పాడి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.ఇందులో హీరోగా శింబు నటించారు.

- Advertisement -

విలన్ గా ఎంట్రీ..
హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సత్తా చాటింది. రమ్యకృష్ణ తర్వాత అంతటి స్థానాన్ని సంపాదించుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఎక్కువగా తెలుగు స్టార్ హీరోలకు లక్కీ లేడీ విలన్ గా పేరు సంపాదించుకుంది.. రెండేళ్ల క్రితం రవితేజ నటించిన క్రాక్ సినిమాలో విలన్ గా నటించి తన అద్భుతమైన నటనతో ఆహా అనిపించిన ఈమె ఆ తర్వాత పలు చిత్రాలలో విలన్ గా నటిస్తూ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత వీరసింహారెడ్డి , పక్కా కమర్షియల్, హనుమాన్, తదితర చిత్రాలలో విలన్ గా నటించింది..రమ్యకృష్ణ తర్వాత మళ్లీ అంతటి నటి ఎవరంటే వరలక్ష్మి శరత్ కుమార్ అని అంతగా సంపాదించింది. ఒకవైపు లేడీ విలన్ గా నటిస్తూనే మరొకవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది..

ప్రేమాయణం..
మధ్యలో హీరో విశాల్ తో కూడా ఈమె ప్రేమాయణం నడిపినట్టుగా వార్తలు వినిపించాయి.. వీరిద్దరు వివాహం కూడా చేసుకోబోతున్నారనే వార్తలు అయితే వినిపించాయి… అయితే ఆ సమయంలో శరత్ కుమార్ అక్కడ నడిగర్ సంఘాన్ని ఎన్నికల సమయంలో ఎదిరించి.. విశాల్ తో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో వీరి పెళ్లి ఆగిపోయిందని సమాచారం..తెలుగు, తమిళ్ వంటి భాషలలో పలు సినిమాలలో నటిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ..

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు