Vaani Kapoor: క్రైం థ్రిల్లర్ కథతో బాలీవుడ్ బ్యూటీ

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో క్రైం థ్రిల్లర్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి సినిమాలు ఎన్ని వచ్చినా, ప్రేక్షకులు ఆదరించడంతో డైరెక్టర్లు క్రైం థ్రిల్లర్ నేపథ్యంలోనే కథలు రాస్తున్నారు. అలాగే ఈ స్టోరీల్లో హీరోయిన్లను పెట్టి, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ కూడా ఓ క్రైం థ్రిల్లర్ సినిమా చేయబోతుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

వాణీ కపూర్ లేడీ ఓరియెంటెడ్ గా మర్దానీ 2 డైరెక్టర్ గోపి పుత్రన్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తుందని గత కొద్ది రోజుల నుంచి వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అయితే దీనిపై వాణీ కపూర్ గానీ, డైరెక్టర్ గోపి పుత్రన్ కూడా స్పందించలేదు. దీంతో అప్పటి వార్తలు రూమర్స్ అనుకున్నారు. కానీ, తాజాగా వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని అధికారిక ప్రకటన వచ్చింది. కథ వినగానే వాణీ కపూర్ ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అయ్యారని, వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మూవీ యూనిట్ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం తమ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ ఉందని, మార్చి లో షూటింగ్ స్టార్ట్ కాబోతుందని తెలిపారు. మొదటి షెడ్యూల్ లఖ్‌నవూ లో ఉంటుందని వెల్లడించారు. కాగా ఈ లేడీ ఓరియెంటెడ్ క్రైం థ్రిల్లర్ ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించనుంది. కాగా వాణీ కపూర్ ఇప్పటి వరకు యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో 5 సినిమాలు చేసింది. తాజాగా దీంతో ఆరో సినమా చేయబోతుంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు