Tollywood : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని అత్యంత అరుదైన గౌరవం పద్మ విభూషణ్ వరించిన సంగతి విదితమే. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి చేసిన సేవలకు గానూ ఆయనకు ఈ అవార్డును ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇక టాలీవుడ్ లో ఈ అరుదైన పురస్కారాన్ని అందుకున్న రెండవ స్టార్ హీరో చిరంజీవి కావడం విశేషం. ఈ నేపథ్యంలో చిరుపై దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీల నుంచి, అభిమానుల నుంచి, రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనల వర్షం కురిసింది.
కొంతమంది స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ప్రశంసిస్తే, మరికొంతమంది సినీ ప్రముఖులు మాత్రం సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ ను కొనియాడారు. పలువురు టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లు, యంగ్ స్టార్స్ కూడా ప్రత్యేకంగా చిరంజీవి పద్మ విభూషణ్ అందుకోవడం పట్ల స్వయంగా ఆయనను కలిసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. కానీ కొంతమంది దిగ్గజ నటులు మాత్రం ఈ విషయంపై స్పందించకపోవడం ఇండస్ట్రీని ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది.
చిరంజీవి పద్మ విభూషణ్ అందుకోవడం పట్ల బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, మోహన్ బాబు, మమ్ముట్టి, సీనియర్ హీరోయిన్లు రాధిక, కుష్బూ వంటి వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అభినందించారు. కానీ కొంతమంది సినీ ప్రముఖులు మాత్రం స్పందించకపోవడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నందమూరి బాలకృష్ణ గురించి. టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరోలైన చిరంజీవి, బాలయ్య మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అనే రూమర్లు ఎప్పటికప్పుడు షికార్లు చేస్తూనే ఉంటాయి.
ఆ రూమర్స్ కు తగ్గట్టుగానే చిరంజీవి ఇంట్లో ఎలాంటి ఈవెంట్ జరిగినా బాలయ్య మాత్రం కనిపించరు. బాలయ్య వైపు కూడా అదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది చాలదు అన్నట్టుగా ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అన్న విషయం టాలీవుడ్ లో మరో హాట్ టాపిక్. బాలయ్య కంటే చిరంజీవికే ఈ విషయంలో ఎక్కువమంది ఓటు వేస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి పద్మ విభూషణ్ పై బాలయ్య స్పందించకపోవడం కొత్త చర్చకు దారి తీసింది. ఇలాంటి విషయాల్లో ముందుండి అభినందిస్తే హుందాగా ఉంటుంది. కానీ బాలయ్య నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం గమనార్హం.
ఇక ఈయనతో పాటు చిరంజీవి పద్మ విభూషణ్ అందుకోవడంపై స్పందించని ప్రముఖులలో సౌత్ దిగ్గజ నటులు రజనీకాంత్, కమల్ హాసన్, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కూడా ఉన్నారు. నిజానికి చిరంజీవి అజాత శత్రువు. సౌమ్యంగా ఉంటూ అవతలి వ్యక్తి ఓ మాట అన్నా కూడా పట్టించుకోరు. పైగా సెలబ్రిటీల బర్త్ డేలు వచ్చినా, ఏదైనా స్పెషల్ సందర్భమైనా చిరంజీవి వెంటనే స్పందిస్తారు. కానీ చిరంజీవికి ఇంత గొప్ప పురస్కారం లభిస్తే ఇండస్ట్రీలో స్టార్స్ గా చెప్పబడే వీళ్ళు కనీసం ఒక ట్వీట్ కూడా వేయలేకపోయారు అంటూ మండిపడుతున్నారు మెగా అభిమానులు. మరి వీళ్లకు అభినందించడానికి అంత బాధేంటో? వీళ్ళలో ఎవరైనా పర్సనల్ గా మెసేజ్ లేదా ఫోన్ చేసి మాట్లాడారా అన్న విషయం కూడా తెలియదు.
Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu