Sundeep Reddy Vanga : మైఖేల్ జాక్సన్ పై సందీప్ కన్ను… బన్నీని ఇంటర్నేషనల్ స్టార్ చేసే ప్లాన్

Sundeep Reddy Vanga : రీసెంట్ గా యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మదిలో ప్రస్తుతం ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ మెదులుతోంది. ఏకంగా మైకెల్ జాక్సన్ బయోపిక్ తో హాలీవుడ్ లో అడుగు పెట్టే ప్లాన్ వేస్తున్నారు డైరెక్టర్ సందీప్. ఈ సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ఇంటర్నేషనల్ స్టార్ గా నిలబెట్టే సన్నాహాలు మొదలయ్యాయని సమాచారం.

సందీప్ మదిలో మైకేల్ జాక్సన్ బయోపిక్

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చేసింది మూడు సినిమాలే అయినప్పటికీ నేషనల్ డైరెక్టర్ గా అరుదైన రికార్డులు క్రియేట్ చేశారాయన. మొదటి సినిమా అర్జున్ రెడ్డితోనే దర్శకుడిగా సత్తా చాటి టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అయిపోయారు. అదే మూవీని బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అక్కడ కూడా ఫస్ట్ తోనే సక్సెస్ అయ్యారు ఈ డైరెక్టర్. రీసెంట్ గా యానిమల్ మూవీతో దాదాపు 900 కోట్లు కొల్లగొట్టారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా చేతిలో ప్రభాస్ తో చేయాల్సిన స్పిరిట్, యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా తన మనసులోని మాటను బయట పెట్టారు.

తనకు మైకేల్ జాక్సన్ సినిమా చేయాలనే కోరిక ఉందని, అయితే ఆయన పాత్రను ఎవరు పోషిస్తారు అనేదే ప్రశ్న అని అన్నారు. కరెక్ట్ హీరో దొరికితే హాలీవుడ్ లో ఈ సినిమా తీయొచ్చని కామెంట్ చేశారు. నిజానికి మైఖేల్ జాక్సన్ జీవితం ఆసక్తికరంగా సాగిందని, ఆయన చిన్ననాటి రోజుల నుంచి స్టార్ గా ఎదిగిన ప్రయాణం అంతా ఒక పెద్ద సినిమా అవుతుందని అన్నారు. ఈ సినిమా తెరపైకి వస్తే జనాలు ఎగబడి చూస్తారని వెల్లడించారు. మైకేల్ బయోపిక్ కు ఎవరైనా దర్శకత్వం వహిస్తే బాగుంటుందని తనకు అనిపిస్తుందని, లేదంటే సరైన హీరో దొరికితే తానే దర్శకత్వం వహిస్తానని చెప్పుకొచ్చారు సందీప్ రెడ్డి. దీంతో తెరపైకి అల్లు అర్జున్ పేరు వచ్చింది.

- Advertisement -

ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో అల్లు అర్జున్ డాన్స్ ఇరగదీస్తారన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే మైకేల్ జాక్సన్, అల్లు అర్జున్ పోలికలు కొంతవరకు మ్యాచ్ అవుతాయి. కాబట్టి అల్లు అర్జున్ హీరోగా సందీప్ రెడ్డి వంగా ఈ ప్రాజెక్టు పట్టా లెక్కించబోతున్నాడని టాక్ నడుస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ పూర్తయ్యాక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మైఖేల్ జాక్సన్ బయోపిక్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

సందీప్ రెడ్డి సినిమాల విషయానికొస్తే…

ప్రస్తుతానికి సందీప్ స్పిరిట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీతో బిజీగా ఉన్నారు. ఇంకా షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ ఆగస్ట్ 15న సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతోంది. ఆ తర్వాత అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు