Sudheer Babu : ఛాన్స్ మిస్

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నుండి తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే చిత్రం విడుదలైన విష‌యం విధితమే. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. అలాగే ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. సుధీర్ బాబుతో డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కిస్తున్న మూడో చిత్రం ఇది. ఇప్పటికే వీళ్ల కాంబినేషన్ లో సమ్మోహనం, వీ వంటి చిత్రాలు వచ్చాయి.

ఇది ఇలా ఉండగా.. సుధీర్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా శుక్రవారం హీరో సుధీర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనకు బాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్న బ్రహ్మస్త్ర మూవీలో అవకాశం వచ్చిందని తెలిపారు. అయితే ఈ ఛాన్స్ ను తాను వదులుకున్నట్లు వెల్లడించారు. తెలుగులో తాను చేయాల్సిన ప్రాజెక్ట్ లు చాలా ఉండటంతో బ్రహ్మస్త్రను వదులుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.

ఇలా సుధీర్ బాబు బాలీవుడ్ ఛాన్స్ ను మిస్ చేసుకున్నారు. కాగా బ్రహ్మస్త్రలో టాలీవుడ్ నుంచి అక్కినేని నాగర్జున నటించారు. అలాగే ఈ చిత్రం బాలీవుడ్ లో భారీ హిట్ ను అందుకుంది. తొలివారంలో రూ. 300 కోట్ల కలెక్షన్లను చేసింది. ఇక‌ సుధీర్ బాబు ఇప్పటికే బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతంలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన భాగీ అనే చిత్రంలో సుధీర్ బాబు విలన్ పాత్రలో కనిపించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు