మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఉగాది తర్వాత విడుదలైన SSMB 28 ఫస్ట్ లుక్ ఘట్టమనేని, సూపర్ స్టార్ అభిమానులకు కిక్ ఇచ్చింది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మూడవ షెడ్యూల్ ఫిక్స్ చేయడానికి రెడీగా ఉంది.
ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా.. పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా కనిపించనున్నారు. అయితే ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కథగా రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాలో మహేష్ బాబుకి అక్కగా ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైనటువంటి కాజోల్ ను తీసుకోవాలని మూవీ యూనిట్ డిసైడ్ అయినట్లు.. అందులో భాగంగానే ఈ నటితో చిత్ర బృందం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కాజోల్ ఈ సినిమాలో మహేష్ బాబుకి అక్క పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే గనుక ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ విషయం తెలియడంతో మహేష్ బాబు అభిమానులు సంతోషంలో మునుగుతున్నారు.
త్రివిక్రమ్ తో ఈ సినిమా పూర్తి అయిన వెంటనే కొంతకాలం బ్రేక్ తీసుకొని.. రాజమౌళి సినిమాలో అడుగుపెట్టనున్నాడు మహేష్ బాబు. అటు రాజమౌళి కూడా మహేష్ బాబు కోసం కథ సిద్ధం చేసుకుని ఉన్నట్లు తెలుస్తోంది. చూద్దాం మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..?
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News