బుల్లితెర అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు శ్రీముఖి. ఆమె యాంకర్గా పలు షోలలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటుందనే చెప్పవచ్చు. ఇక ఇప్పటివరకు చాలా రియాల్టీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహించారు. అంతేకాదు.. శ్రీముఖికి ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే ప్రతి పోస్ట్ పట్ల అభిమానులు చాలా ఆసక్తి కనబరుస్తుంటారు.
ఇటీవలే ‘సరిగమప’ షో ద్వారా టెలివిజన్ ప్రియులను అలరించిన రాములమ్మ తాజాగా సైమా అవార్డుల వేడుకల్లో మెరిసింది. సైమా అవార్డ్స్ 2022 లో యాంకర్గా వ్యవహరించింది శ్రీముఖి. తన పదునైన మాటలతో వేడుకలకు హాజరైన సెలబ్రెటీలను మెప్పించింది. ఈ వేడుకలకు దక్షిణాదిలోని అన్ని భాలకు సంబంధించిన యాంకర్స్ ఉంటారు. తెలుగు నుంచి ఈ అవకాశం శ్రీముఖిని వరించింది.
ఈ వేడుకల కోసం శ్రీముఖి రెమ్యునరేషన్ భారీగానే తీసుకున్నట్టు సమాచారం. సైమా వేడుకల్లో యాంకరింగ్ చేసిన వారందరి కంటే శ్రీముఖికి అత్యధిక పారితోషికం ఇచ్చారట. రెండు రోజులకు కలిపి ఏకంగా రూ.15లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు టాక్. శ్రీముఖి కేవలం రియాల్టీ షోస్ మాత్రమే కాకుండా సినిమాల్లోనూ పలు కీలక పాత్రలతో తన నటనతో మెప్పించింది. ముఖ్యంగా నేను శైలజ, మ్యాస్ట్రో, జులాయి, క్రేజీ అంకుల్స్ వంటి సినిమాల్లో నటించింది శ్రీముఖి.