Sridevi VijayKumar Movie: సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోతో పోల్చుకుంటే హీరోయిన్స్ త్వరగా ఫేడ్ అవుట్ అవుతూ ఉంటారు ఒకప్పుడు వరుస సినిమాలలో స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన హీరోయిన్లు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి.. తల్లిగా, అత్తగా, వదినగా, అక్కగా పలు పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ..ఈ క్రమంలోనే ఒకప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో రొమాన్స్ చేసిన శ్రీదేవి విజయ్ కుమార్ ఇప్పుడు మరొక హీరో సినిమాలో తల్లిగా నటించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ కి జోడీగా..
తన అందం , అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులుగా సొంతం చేసుకున్న శ్రీదేవి .. రుక్మిణి సినిమాతో బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ఈశ్వర్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది.. ఈ సినిమాలో ప్రభాస్ తో రొమాన్స్ చేసి .. తన అందంతో నటనతో ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత కొన్ని చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు కూడా పోషించింది.. అవకాశాలు తగ్గుతున్న క్రమంలో ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది.. కానీ బుల్లితెర నుండి అభిమానులకు దగ్గరగా ఉంది.. పైగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం వరుస ఫోటోషూట్లతో యువతను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా గతంలో కామెడీ స్టార్స్ అనే కామెడీ షోకి జడ్జిగా కూడా వ్యవహరించింది.
నారా రోహిత్ మూవీ లో హీరోయిన్ కి తల్లిగా..
ఇకపోతే తాజాగా ఈమె మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినట్లు సమాచారం.. ఒకప్పుడు ప్రభాస్ తరసన నటించి ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం ఒక హీరో సినిమాలో తల్లిగా నటిస్తుండడంతో ప్రభాస్ అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు. నారా రోహిత్ 20వ సినిమా “సుందర కాండ” లో హీరోయిన్ కు తల్లి పాత్రలో శ్రీ దేవి విజయ్ కుమార్ నటిస్తోంది . ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. చూడడానికి అందం, అభినయంతో ఇప్పటికీ అంతే యంగ్ గా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇలా హీరోయిన్ కి తల్లి పాత్రలో నటిస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏదిఏమైనా ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి.. ఇప్పుడు హీరోయిన్ కి తల్లి పాత్రలో నటిస్తూ ఉండడం నిజంగా అభిమానులను ఇబ్బంది పెడుతోందని చెప్పవచ్చు..
సుందరకాండ సినిమా విశేషాలు..
ఇక నారా రోహిత్ సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడిని పరిచయం చేస్తూ సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ పై సంతోష్ చిన్నపొళ్ల, గౌతమ్ రెడ్డి , రాకేష్ మహంకాళి నిర్మించిన వినోదభరితమైన రొమాంటిక్ కామెడీ మూవీ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. ఇక తాజాగా సుందరకాండ హిందూ ఇతిహాస రామాయణంలో ఐదవ కాండం సినిమాపై పాజిటివ్ ఇంప్రెషన్ ను క్రియేట్ చేసే విధంగా పోస్టులు, పోస్టర్ ను శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నారు.. కానీ రెండు రోజుల క్రితం ఈ సినిమా టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ విడుదల చేయడం జరిగింది.. ఇక ఇందులో నారా రోహిత్ సరసన విర్తి వాఘని హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. ఈమెకు తల్లి పాత్రలో శ్రీదేవి విజయ్ కుమార్ నటిస్తున్నారు.. గణేష్ చతుర్థి సెప్టెంబరు 7 సందర్భంగా సెప్టెంబర్ 6న ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.