Sridevi: ఆ గండమే శ్రీదేవి మరణానికి శాపమా..?

Sridevi.. అతిలోక సుందరి అందాల తార దివంగత నటీమణి శ్రీదేవి గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు.. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈమె.. సినీ ప్రేక్షకులనే కాదు సెలబ్రిటీలను కూడా తన వైపు తిప్పుకుంది.. ఈమెతో ఒక్కసారి మాట్లాడితే చాలు అనుకునే వారు కూడా చాలామంది ఉన్నారు..అంతలా తన నటనతో, అందంతో మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.. ఇకపోతే శ్రీదేవి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుని.. అనూహ్యంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. దీంతో అప్పటినుంచి ఈమె మరణం పై అనేక వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.. ముఖ్యంగా ఈమె మరణానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయము ఊహాజనితంగానే మిగిలిపోతోంది కానీ అసలు నిజం మాత్రం తెలియలేదు.. అయితే ఇప్పుడు తాజాగా ఈమె మరణానికి ఇదే కారణం అంటూ మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

Sridevi:Is that lit the curse of Sridevi's death..?
Sridevi:Is that lit the curse of Sridevi’s death..?

ఆ గండమే శ్రీదేవి మరణానికి కారణం..

గుర్తుండిపోయే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ఎనలేని కీర్తి సొంతం చేసుకున్న శ్రీదేవికి సినిమాని ప్రపంచం.. ఈ క్రమంలోనే చనిపోయేంతవరకు కూడా సినిమానే జీవితంగా బ్రతికింది. అంతేకాదు హీరోయిన్గా గ్లామర్ దెబ్బ తినకూడదని ఎన్నో కఠినమైన నియమాలు కూడా పాటించేది. ఆ కఠినమైన ఆహార నియమాలే అప్పుడప్పుడు ఆమెను మరింత ఇబ్బంది పెట్టాయి.. కళ్ళు తిరగడం సమస్య వల్లే ఆమె బాత్ టబ్ లో పడిపోయి ఊపిరాడక నీటిలో మరణించింది అని ఆమె భర్త బోణీ కపూర్ ఎన్నో సందర్భాలలో వెల్లడించారు. అయితే ఈమె మరణానికి కారణం మరొకటి ఉందని.. అదే జలగండం అని సమాచారం.. శ్రీదేవికి చిన్నప్పటి నుంచి జలగండం ఉందట.. దానివల్ల ఆమె అలా బాత్ టబ్ లో పడి నీటిలో ఊపిరాడక మరణించింది అని ప్రచారం జరుగుతోంది.. అంతేకాదు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడే ఒక గండం నుంచి తప్పించుకుందని.. కానీ ఇప్పుడు ఆ గండం నుంచి తప్పించుకోలేక ఏకంగా ప్రాణాలనే కోల్పోయిందని సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది.. అయితే మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ జలగండం కారణంగా శ్రీదేవి మరణించింది అనే వార్త మాత్రం వినిపిస్తోంది..

శ్రీదేవి వారసత్వం..

ప్రముఖ నిర్మాత బోణీ కపూర్ ను వివాహం చేసుకున్న శ్రీదేవి.. జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ అనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.. ఇక జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు ఇప్పుడు తన తల్లి కోరిక మేరకు ఎన్టీఆర్ తో తన మొదటి తెలుగు సినిమాను చేయబోతోంది.. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఈమె ఫస్ట్ లుక్ ను కూడా రివీల్ చేశారు చిత్ర బృందం.. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ తో కూడా జత కట్టనుంది ఈ ముద్దుగుమ్మ.. ఖుషీ కపూర్ మాత్రం అక్కడే బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ సెటిల్ అయిపోయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు