Sivaji Raja.. ఒకప్పుడు కమెడియన్ గా ప్రేక్షకులను అలరించిన శివాజీ రాజా హీరోగా కూడా కొన్ని చిత్రాలకు పనిచేశారు.. అలా సీనియర్ నటుడిగా, సీనియర్ మా అధ్యక్షుడిగా కూడా పేరు దక్కించుకున్న ఈయన.. నటుడిగా 260 కి పైగా చిత్రాలలో నటించారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా అన్ని రకాల పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన శివాజీ రాజా బుల్లితెరపై మొగుడ్స్ పెళ్లామ్స్ అమృతం వంటి సీరియల్స్ తో మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు..
భీమవరం కి చెందిన ఈయన 1962 ఫిబ్రవరి 26న రామరాజు , చంద్రావతి దంపతులకు జన్మించారు. ఈయన తండ్రి భీమవరంలోని డి.ఎన్.ఆర్ కళాశాలలో అటెండర్ గా పనిచేసేవారు. ఇక శివాజీ రాజా హైదరాబాదులో పాలిటెక్నిక్ పూర్తి చేసి అక్కడే నటనలో శిక్షణ పొంది .. నటుడిగా అరంగేట్రం చేశారు. ఈయన భార్య పేరు అరుణ.. ఈ దంపతులకు ఒక కొడుకు, కూతురు కూడా ఉన్నారు.. ఇదిలా ఉండగా ఈయన ఫ్యామిలీ మీడియా ముందుకు రావడం చాలా సందర్భాలలో శివాజీ రాజా మాత్రమే కెమెరా ముందు కనిపించారు సినిమా ఫంక్షన్ లో అయినా ఏ ఇతర కార్యక్రమాలకైనా శివాజీ రాజా సింగిల్ గా వస్తారు అందుకే ఈయన కుటుంబం గురించి చాలామందికి తెలియదనే చెప్పాలి మరి ఈరోజు మనం శివాజీ రాజా ఫ్యామిలీ ఫోటోలు ఇప్పటివరకు చూడనివి ఒకసారి చూసేద్దాం..
శివాజీ రాజా కొడుకు ..
ఇకపోతే శివాజీ రాజా కొడుకు విజయ్ రాజా సినీ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. 2020లో జెమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు.. ఎస్వీ కృష్ణారెడ్డి స్క్రిప్ట్ ని అందించగా దర్శకుడు సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించారు .అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు.. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఓంకాళి అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు విజయ్ రాజా.. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.మరి ఈ సినిమాతో నైనా సక్సెస్ సాధించి అభిమానుల దృష్టిలో పడతారేమో చూడాలి.
View this post on Instagram