మెలోడీ సాంగ్స్ పాడటంలో కేరాఫ్ అడ్రెస్ సిద్ శ్రీరామ్. ఆయన గాని ఒక సాంగ్ పాడుతున్నాడు అంటే ఆ సాంగ్ ఆటోమేటిక్ గా మన ఫోన్ లోని ప్లే లిస్ట్ లోకి యాడ్ అయిపోతుంది. అయితే ఈ మధ్య సిద్ శ్రీరామ్ ఫ్లో బాగా తగ్గింది. అప్పట్లో గ్యాప్ లేకుండా ఆయన పాటలు రిలీజ్ అయ్యేవి.
సర్కారువారి పాట సినిమా లోని కళావతి సాంగ్ లో చాలా పదాలు తప్పుగా ఉచ్చారించాడు అనే కారణంగా సిద్ శ్రీరామ్ ని కొంచెం దూరం పెట్టారు మన మ్యూజిక్ డైరెక్టర్స్.
అయితే సిద్ లేటెస్ట్ గా సందీప్ కిషన్ సినిమాలో ఒక సాంగ్ పాడారు . సాంగ్ రిలీజ్ అవడమే ఆలస్యం ట్రేండింగ్ లోకి వెళ్ళిపోయింది. యూట్యూబ్ లో మిల్లియన్ల కొద్దీ వ్యూస్ ని సాధించింది. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ రీల్స్ లో కూడా ఈ సాంగ్ ట్రెండ్ అవుతుంది.”నిజమే నే చెబుతున్న జానే జానా” అని సాగే ఈ మెలోడీ ఇన్స్టంట్ గా అందరికి కనెక్ట్ అయిపోయింది.
ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన సందీప్ కిషన్ “మైఖేల్ ” మూవీ నిరాశ పరచడంతో నెక్స్ట్ సినిమాతో మంచి కంబ్యాక్ ఇవ్వాలని సందీప్ కిషన్ చూస్తున్నారు. అందుకే ఆయన సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్లో సందీప్ ఇన్వాల్వ్ అవుతున్నాడు. అందుకే సిద్ తో సాంగ్ పాడించలనే ఐడియా కూడా సందీప్ కిషనే ఇచ్చాడంట
ప్రస్తుతం సందీప్ వి.ఐ ఆనంద్ దర్శకత్వం లో “ఊరి పేరు భైరవ కోన “అనే మూవీ లో నటిస్తున్నారు. ఫాంటసీ అడ్వెంచర్ గా ఈ మూవీ ఉండబోతుంది. AK ఎంటర్టైన్మెంట్స్ మరియు, హాస్య మూవీస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకి చేరుకుంది. సమ్మర్ ఎండ్ లో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News