Sai Pallavi: అలాంటి సినిమాల్లోనే నటిస్తా

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి నటనకు, అందానికి, డాన్స్ కు ఫిదా అయిన ప్రేక్షకులు చాలామందే ఉన్నారు. ఫిదా సినిమాతో కథానాయకగా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి.. తమిళ, తెలుగు సినిమాల్లో కథానాయకగా నటించి మెప్పించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదాలో భానుమతి పాత్ర పోషించి తెలుగు సినిమాకి పరిచయమైన సాయి పల్లవి ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. ఆ తరువాత నాని సరసన ఎంసీఏ చిత్రంలో నటించి మెప్పించింది. తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తోంది సాయి పల్లవి. ఇటీవల విరాటపర్వం, గార్గి వంటి చిత్రాలతో థియేటర్లలో సందడి చేసింది.

అయితే ఆదివారం బెంగుళూరులో జరిగిన ఫిలింఫేర్ అవార్డులలో సాయి పల్లవి ఉత్తమ నటిగా రెండు అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఆమె నటించిన లవ్ స్టోరీ, శ్యాం సింగరాయ్ సినిమాలకు ఉత్తమ నటిగా రెండు ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకుంది. ఒకే వేదికపై రెండు పురస్కారాలు అందుకోవడం పై సాయి పల్లవి ఆనందాన్ని వ్యక్తం చేసింది. తాను తీసుకున్న అవార్డులతో సెల్ఫీ ని షేర్ చేస్తూ.. ” రెండు సినిమాలకు ఒకే ఏడాది పురస్కారాలు దక్కడం అరుదైన విశేషం. ఈ సందర్భం నాకెంతో ప్రత్యేకం. లవ్ స్టోరీ, శ్యాం సింగరాయ్ వంటి గొప్ప చిత్రాలలో నటించే అవకాశం దక్కింది. ఈ తరహా క్యారెక్టర్స్ లో మళ్ళీ మళ్ళీ నటించాలని కోరుకుంటున్న”. అంటూ చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు