Sai Dharam Tej : ఒకప్పుడు నా పేరు ఎవరికీ తెలియదు

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సినీ రంగప్రవేశం చేసిన సాయి ధరమ్ తేజ్ గతేడాది యాక్సిడెంట్ కు గురైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ ప్రేక్షకులని పలకరించనున్నాడు. ఈ నేపథ్యంలోనే తన 16వ సినిమాను కూడా ప్రకటించాడు సాయిధరమ్ తేజ్. కొత్త దర్శకుడు జయంత్ ఈ సినిమాతో వెండితెరకి పరిచయం అవబోతున్నాడు. సాయి ధరమ్ 15వ సినిమాను తెరకెక్కిస్తున్న ‘బివిఎస్ఎన్ ప్రసాద్’ ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నాడు.

శుక్రవారం పూజా కార్యక్రమాలతో అఫీషియల్ గా ఈ సినిమాను లాంచ్ చేశారు. త్వరలోనే షూటింగ్ కూడా మొదలుకానుంది. అలాగే హీరోయిన్లు, టెక్నీషియన్లు తదితర వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. అయితే ఇది ఇలా ఉండగా, ఈ మూవీ మీద ఓ అభిమాని ఇలా స్పందించాడు. “కొంచెం పేరు తెలిసిన డైరెక్టర్ తో సినిమా తీయి అన్నా..” అని అడిగాడు. దీనికి సాయి ధరమ్ తేజ్ ఎంతో కూల్ గా రిప్లై ఇచ్చాడు. “ఒకప్పుడు నా పేరు కూడా మీకు తెలియదు. ఆయన పేరు జయంత్. మీరు ఆ పేరుని గుర్తు పెట్టుకోండి” అని రిప్లై ఇచ్చాడు.

దీంతో సాయి ధరమ్ తేజ్ తన మూలాలను మరిచిపోలేదని, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా కెరీర్ ను మొదలుపెట్టాడో గుర్తు పెట్టుకున్నాడు. ఒదిగి ఉండటం అంటే ఇదే అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మెగా ఫ్యామిలీ బ్లడ్ లోనే ఇలా ఒదిగి ఉండటం అనేది ఉందేమో అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు