RC 17 : సుకుమార్ మాట నిలబెట్టుకుంటాడా?

RC 17 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన 17వ మూవీని లెక్కల మాస్టర్ సుకుమార్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. RC 17 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్న ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేసి మెగా ఫాన్స్ దిల్ ఖుష్ చేసేసారు. కానీ సుకుమార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారా? అన్న ప్రశ్న అప్పుడే మొదలైపోయింది.

ఇది సాధ్యమయ్యే పనేనా?

రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోంది ఈ పొలిటికల్ థ్రిల్లర్. ఆ తర్వాత ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో స్పోర్ట్స్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల దీనికి సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇక ఆ తర్వాత తనకు రంగస్థలం లాంటి మాస్ బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్ తో మరోసారి కలిసి పని చేయబోతున్నారు చెర్రీ. అయితే ఈ ఏడాది చివర్లో సుకుమార్, చెర్రీ మూవీ సెట్స్ పైకి వెళ్తుందని, 2025 రెండో అర్ధ భాగంలో మూవీని రిలీజ్ చేయడానికి టీం ప్లాన్ చేస్తోంది. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఇది అసలు వర్కౌట్ అయ్యే ప్లానేనా అనే డౌట్ రాకమానదు.

ఎందుకు వర్క్ అవుట్ కాదు?

రామ్ చరణ్ ఇప్పటికే దాదాపుగా 30 నెలలుగా గేమ్ చేంజర్ మేకింగ్ లోనే స్టక్ అయిపోయారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడానికి ఇంకెన్ని రోజులు టైం పడుతుందో తెలీదు. అలాగే ఈ మూవీ పూర్తయిన వెంటనే బుచ్చిబాబు మూవీని స్టార్ట్ చేయాలి చెర్రీ. బుచ్చిబాబు మూవీని వీలైనంత త్వరగా స్టార్ట్ చేసి ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నాడు రామ్ చరణ్. కానీ బుచ్చిబాబుకు ఇదే మొదటి పాన్ ఇండియా మూవీ. షెడ్యూల్ కాస్త అటు ఇటు అయినా లేదా షూటింగ్ విషయంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగినా ఈ ప్రాజెక్టుకు కూడా అనుకున్న దానికంటే ఎక్కువగానే టైం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే చెర్రీ, సుకుమార్ మూవీ ఈ ఏడాది చివరికల్లా సెట్స్ పైకి వెళ్ళడం అనేది చాలెంజింగ్ అని చెప్పొచ్చు.

- Advertisement -

ప్రస్తుతం సుకుమార్ “పుష్ప 2” మూవీ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ముందుగా ఆయన ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఆ తర్వాత చరణ్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సుకుమార్ అనుకున్న సమయానికి “పుష్ప 2” మూవీని పూర్తి చేసి, వెంటనే రాంచరణ్ 17వ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పటికీ, రామ్ చరణ్ ఈ ఏడాది చివరిదాకా బుచ్చిబాబు మూవీతోనే గడపాల్సి వస్తుంది. మరి అలాంటప్పుడు సుకుమార్, చెర్రీ మూవీ షూటింగ్ ఈ ఏడాది చివర్లో స్టార్ట్ అవుతుందా? అంటే అనుమానమే. అయితే ఇక్కడ సుకుమార్ కు మరో దారి కూడా ఉంది. చెర్రిని ఒకేసారి రెండు పడవల ప్రయాణం చేయమనే అవకాశం ఉంది. 2025 చివరికల్లా ఈ మూవీని రిలీజ్ చేయాలంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్టార్ట్ చేయాలి. సుకుమార్ పర్ఫెక్షన్ అంటూ సాగదీస్తాడన్న విషయం తెలిసిందే. కాబట్టి చెర్రీ ఒకవైపు బుచ్చిబాబు సినిమాను చేస్తూనే, మరోవైపు సుకుమార్ మూవీ షూటింగ్ లో కూడా పాల్గొనాల్సి ఉంటుంది. అయినప్పటికీ సుకుమార్ అనుకున్న సమయానికి మూవీని స్టార్ట్ చేస్తాడా? రిలీజ్ చేస్తాడా? మరి సుకుమార్ ఈ పరిస్థితిని ఎలా మేనేజ్ చేస్తాడు ? అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు