Prabhas: మరొకసారి ప్రభాస్ పై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు..!!

Prabhas:రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను , రాజకీయ నాయకుల భవిష్యత్తును సైతం తెలియజేస్తూ మంచి పాపులారిటీ సంపాదించారు. ఇలాంటి తక్కువ సమయంలోనే వారి జాతకాలని చెబుతూ సోషల్ మీడియాలో భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు వేణు స్వామి.. ఎక్కువగా ప్రభాస్ జాతకం గురించి తెలియజేస్తూ ఉంటారు. ప్రభాస్ జాతకం ఏమాత్రం బాగాలేదని ఆయనతో సినిమాలు చేసిన నిర్మాతలు అందరూ కూడా నష్టపోతారంటూ చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానులను వేణు స్వామి పైన ఫైర్ అయ్యేలా చేస్తూ ఉంటాయి.

వేణు స్వామి కామెంట్స్ కి శ్యామలాదేవి ఫైర్..
ఎన్నోసార్లు ప్రభాస్ టీమ్ ను సైతం ఇబ్బందులు పెట్టేలా వేణు స్వామి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు..అటు ప్రభాస్ జాతకం పైన ప్రభాస్ పెద్దమ్మ (శ్యామల దేవి ) కూడా గతంలో ప్రభాస్ జాతకం తన దగ్గర లేదని.. అలాంటిది ఆ వేణు స్వామి దగ్గర ఎలా ఉంటుంది అంటూ ఒక ఇంటర్వ్యూలో ఫైర్ అయ్యింది. కేవలం పాపులర్ కోసమే అలా చేసి ఉంటారని కూడా ఆమె తెలియజేసింది. ఇప్పుడు మళ్లీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం పైన వేణు స్వామి మాట్లాడడం జరిగింది.

- Advertisement -

ప్రభాస్ తల్లికి మాత్రమే ప్రాధాన్యత..
అసలు విషయంలోకి వెళితే.. ప్రభాస్ కి ఆయన పెద్దమ్మ శ్యామలాదేవికి అసలు సంబంధమే లేదని చాలామంది బంధువులే చెబుతున్నారని.. కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాల గురించి తాను ఏమి మాట్లాడదలచుకోవడం లేదని.. చాలామంది ఆయన పెద్దమ్మ కా ఆయన జాతకం తెలియకుండా ఉంటుందా అని అనుకుంటూ ఉంటారు కానీ తనకు తెలిసినంతవరకు.. తాను ప్రభాస్ తల్లికి మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తానంటూ వేణు స్వామి వెల్లడించారు.. కొన్ని కారణాల చేత ప్రభాస్ జాతకం ఇతరుల నుంచి తన దగ్గరకు వచ్చిందని కూడా వెల్లడించారు.

ఆ విషయం ఎప్పటికీ రహస్యమే..
ప్రభాస్ జాతకాన్ని చూసి తాను చెప్పినప్పటికీ అది ఎవరి ద్వారా వచ్చిందనే విషయం మాత్రం తాను సీక్రెట్ గానే ఉంచుతానని.. ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి కూడా అనుకోకుండా ఒకసారి తన దగ్గరకు వచ్చారని.. అయితే అది కేవలం తన భర్త కృష్ణంరాజు గురించే అన్నట్లుగా వెల్లడించారు.. కృష్ణంరాజు జాతకరీత్యా తాను గవర్నర్ అవుతారా లేదా అనే విషయం అడగడానికి వచ్చినట్లుగా తెలియజేశారు వేణు స్వామి.. అయినప్పటికీ కూడా శ్యామలాదేవి తాను ఎవరో తెలియనట్లుగా మాట్లాడటం అది సరైనది కాదని వేణు స్వామి వెల్లడించారు.. ప్రస్తుతం వేణు స్వామి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో మరొకసారి వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికైతే అటు శ్యామలాదేవి తాను ఎవరో తెలిసి కూడా నాటకాలు ఆడుతోందంటూ డైరెక్ట్ గానే ఫైర్ అవుతున్నారు వేణు స్వామి.. మొత్తానికైతే ప్రభాస్ పెద్దమ్మ పై వేణు స్వామి చేసిన కామెంట్లు మళ్లీ వైరల్ గా మారుతున్నాయి.. కృష్ణంరాజు భార్యగా శ్యామలాదేవి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు.. అలాంటిది ఇప్పుడేమో అటు శ్యామలాదేవి ఇటు ప్రభాస్ కి సంబంధం లేదు అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. మరి దీనిపై అటు అభిమానులు ఇటు ప్రభాస్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు