Tollywood: బేబీ చిత్ర యూనిట్ కు పోలీసుల నోటీసులు!

Tollywood:

టాలీవుడ్ లో రెండు నెలల కిందట రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన సినిమా ‘బేబీ’. యువత పై ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. నిబ్బా నిబ్బిల లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా సొసైటీ లో కొన్ని కారణాల వల్ల యూత్ ఎలా చెడిపోతున్నారని, ప్రేమకి, ఆకర్షణకి తేడా తెలియక ఎందరో కుర్రాళ్లు, అమ్మాయిలు తమ జీవితాలను నాశనం చేసుకుంటుంన్నారని ఈ సినిమా ద్వారా తెలియచేసారు.

టాలీవుడ్ లో పలు సెలబ్రిటీలను మెప్పించిన ఈ సినిమా థియేటర్లోంచి వెళ్ళిపోయినా కూడా తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ రోజు మాదాపూర్ లో ఓ హోటల్ లో డ్రగ్స్ దందా జరుగుతున్నట్టు గుర్తించిన పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడికి చేరుకొని పలువురిని అదుపులోకి తీసుకుని హోటల్ కి సీజ్ వేశారు. ఈ క్రమంలో పోలీస్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్ సీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ సినిమాల నుండి కూడా యూత్ ఇలాంటివి నేర్చుకుని చెడిపోతున్నారు. ఇలాంటి మార్గంలోకి వచ్చి యువత తమ జీవితాలని నాశనం చేసుకోవద్దంటూ చెప్తూ, ఇటీవల రిలీజ్ అయిన బేబీ సినిమాలో యువత డ్రగ్స్ ఎలా వాడాలో యూత్ కి నేర్పించేలా ఒక సీన్ రాసారని, అలాంటి తప్పులు మళ్ళీ సినిమాల్లో చేయకండని వార్నింగ్ ఇచ్చారు.

అంతేకాదు ఈ విషయం టాలీవుడ్ లో అందరికి గుర్తుండేలా బేబీ సినిమా చిత్ర యూనిట్ కి వార్నింగ్ ఇస్తూ నోటీసులు పంపారు పొలిసు శాఖా వారు. మరి ఇది గమనించి టాలీవుడ్ డైరెక్టర్లు తమ రాబోయే సినిమాల్లో ఎలాంటి జాగ్రత్తలు వహిస్తారో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు