Pawan Kalyan: మొదటిసారి మామ అల్లుళ్ళు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈయన సినిమా వస్తుంది అంటే చాలు ఏమి మొదలవ్వకముందే సెలెబ్రేషన్స్ మొదలవుతాయి,
స్ట్రైట్ ఫిలిం అయినా రీమేక్ ఫిలిం అయినా ఆడియన్స్ కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తారు,అది ఆయన క్రేజ్.
వకీల్ సాబ్ సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ వరుస సినిమాలను అనౌన్స్ చేసి అభిమానులకు ఆనందాన్ని ఇచ్చారు.
తన కెరియర్ లో అధికశాతం ఎక్కువ రీమేక్ సినిమాలే చేసారు కళ్యాణ్.
ఇప్పుడు కూడా మరొక రీమేక్ సినిమాను లైన్ లో పెట్టనున్నాడు పవర్ స్టార్. ఈ సినిమాలో పవన్ తో పాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటించనున్నారు.

మెగా హీరోస్ లో సాయి ధర్మ తేజ్ ఒక ప్రత్యేకమైన హీరో ,
అందరికంటే ఎక్కువ ప్లాప్ సినిమాలు పడిన కూడా ఇప్పటికి సాయి ధర్మ తేజ్ సినిమా అంటే ఓపెనింగ్స్ బాగానే ఉంటాయి.
పవన్ కళ్యాణ్ కి సాయి ధరమ్ తేజ్ అంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ,
ధర్మతేజ్ కి పవన్ కళ్యాణ్ మామయ్య అంటే ప్రాణం,
అది మనకు చాలా సినిమా ఫంక్షన్స్ లో అర్ధమైపోతుంది.

అయితే ప్రస్తుతం ఈ మెగా హీరోలు ఒకేసారి వెండితెరపై అలరించనున్నారు సముథ్రకని దర్శకత్వంలో “వినోదయ సీతం” సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రానుంది. ఇవన్నీ మొన్నటివరకు ఊహగానాలే అనుకున్నారంతా కానీ రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సముథ్రకని తాను పవన్ ని డైరెక్ట్ చేయబోతున్నట్లు చెప్పి సర్ ప్రైజ్ చేశారు. తాను ‘వినోదయ సీతం’ తెలుగు రీమేక్ డైరెక్ట్ చేయబోతున్నట్లు సముద్రఖని క్లారిటీ ఇచ్చారు. తాను పవన్ కళ్యాణ్ కి పెద్ద అభిమానినని, తనలాంటి అభిమానులందరినీ దృష్టిలో పెట్టుకొని ఆయనను డైరెక్ట్ చేస్తానన్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సముథ్రకని తెలిపారు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు