Parasuram: 30 నిమిషాల చాట్ చై ఫ్లాట్

యువత సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన పరశురామ్ సోలో సినిమాతో మంచి అందుకున్నాడు. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసిన అవి అంతంత మాత్రమే ఆడాయి. విజయ్ దేవరకొండతో చేసిన “గీత గోవిందం” సినిమా మంచి హిట్ అయింది. అర్జున్ రెడ్డి సినిమాతో భారీ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండకి “గీత గోవిందం” సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను తెచ్చిపెట్టింది.

ఆ సినిమా తరువాత దర్శకుడు పరశురామ్ నాగ చైతన్యతో సినిమా చెయ్యాల్సి ఉంది. కానీ మహేష్ నుంచి పిలుపు రావడం, పరశురామ్ చెప్పిన లైన్ మహేష్ కి వెంటనే నచ్చడం వలన సర్కారు వారి పాట సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలక్షన్స్ రాబట్టింది. రీసెంట్ టైమ్స్ లో చాలా సెట్టిల్డ్ గా యాక్ట్ చేసిన మహేష్ టైమింగ్ ను మరోసారి బయటకు తీసాడు పరశురామ్. నాగ చైతన్య , పరశురామ్ మధ్య పరస్పర ఒప్పందంతోనే మహేష్ వద్దకు వెళ్ళాడు పరశురామ్.

మళ్ళీ పరశురామ్ ఇప్పుడు నాగ చైతన్యతో సినిమా చెయ్యాల్సి ఉంది.
ఇటీవలే చై కి పరశురామ్ ఒక 30 నిమిషాల పాటు కథ కాన్సెప్ట్ ను వినిపించాడని, ఆ కాన్సప్ట్ విన్న నాగ చైతన్య చాలా హ్యాపీ గా ఫీల్ అయి తనకు బాగా నచ్చిందని చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది. అలానే పరశురామ్ బాలయ్య తో సినిమా చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. పరశురామ్ ఇప్పుడు ఎవరితో ముందు వెళ్తాడో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు