పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ నటి కృతి సీతగా వస్తున్న తాజా చిత్రం ఆదిపురుష్. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ 500 కోట్ల బడ్జెట్ సినిమా ఈ నెల 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే భారీగా ప్రమోషన్లు చేస్తున్న ఆదిపురుష్ టీం, ప్రేక్షకులను చేరుకునేందుకు వినూత్నంగా ప్లాన్ చేస్తుంది. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి విధితమే. ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రజల్లోకి తీసుకోవడానికి సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ కు సన్నిహితంగా ఉండే స్టార్స్ కూడా రంగంలోకి దిగుతున్నారు.
ముందుగా ఆదిపురుష్ సినిమాను ఆనాధ పిల్లలు, వృధాశ్రమాల్లో ఉండే వారి కోసం 10,000 టికెట్లను ఫ్రీగా ఇస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని తర్వాత ఇండస్ట్రీలో ప్రభాస్ కు సన్నిహితంగా ఉన్న నటీనటులు కూడా ఆనాధలకు, వృధాశ్రమాల్లో ఉండే వారికి ఫ్రీగా టికెట్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ తన తరపున ఆనాధలకు 10,000 టికెట్లు ఫ్రీగా ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.
అలాగే ప్రభాష్ ప్రాణ మిత్రుడు గోపీచంద్ తో పాటు అనుష్క, అల్లు అర్జున్ తమ తరుపున 10,000 టికెట్లను ఫ్రీగా పంచనున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ కూడా ఆనాధల కోసం 10,000 టికెట్లు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఇలా ప్రభాస్ సన్నిహితులు అందరూ కలిసి దాదాపు 1,00,000 టికెట్లను ఫ్రీగా పంచాలని నిర్ణయం తీసుకున్నారట. దీనిపై అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఒక మంచి సినిమాను అందరికీ చూపించాలనే ఆలోచన రావడం గర్వకారణమని అంటున్నారు.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News