NTR30: టాలీవుడ్ ఎంట్రీకి భారీగా డిమాండ్ చేస్తున్న జాన్వీ !

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’, ‘గుడ్ లక్ జెర్రీ’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. చివరగా మిలీ లో కనిపించింది. ఈ మూవీలో ఆమె నటనకు అభిమానుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు లభించాయి.

జాన్వి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్30’లో హీరోయిన్ పాత్రను పోషించనుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ చిత్రంలో చేసేందుకు జాన్వి కపూర్ భారీ రెమ్యూనరేషన్ తీసుకోనుందని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి.

ఎన్టీఆర్ 30లో నటించేందుకు జాన్వి కపూర్ రూ.4 కోట్లను పారీతోషికంగా అందుకోనుందట. బాలీవుడ్ లో అనేక సినిమాలు చేసి ఆమె పాపులారిటీ బాగా సంపాదించుకుంది. అందువల్ల మేకర్స్ అంత రెమ్యూనరేషన్ చెల్లించేందుకు అంగీకరించారని సమాచారం. సమంత, నయనతార వంటి హీరోయిన్స్ ఒక్కో చిత్రానికి రూ. 5 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నారు. వారితో పోలిస్తే జాన్వీ కపూర్ తీసుకుంటుంది తక్కువే అయినప్పటికీ అది భారీ మొత్తం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

- Advertisement -

ఎన్టీఆర్ 30 కి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. యువ సుధా ఆర్ట్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియాగా నిర్మిస్తుంది. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనుంది. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ మార్చి 20 తర్వాత ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు