టాలీవుడ్ టాలెంట్ హీరోయిన్స్ లో ఒకరైన రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో 2014 లో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమా తో హీరోయిన్ గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్లాస్ హిట్ అయింది. ఆ తర్వాత మెల్లి మెల్లిగా వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ తెలుగులో పూర్తిగా పాగా వేసింది. బెంగాల్ టైగర్, సుప్రీమ్, జై లవ కుశ, తొలి ప్రేమ, ప్రతి రోజు పండగే సినిమాల్తో మంచి హిట్లు అందుకుంది. రాశి ఖన్నా కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగు లో చక్కగా మాట్లాడగలదు. అంతే కాదు తన సినిమాలకు తనే డబ్బింగ్ చెప్పుకుంటుంది. అందువల్ల టాలీవుడ్ లో ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.
అయితే రీసెంట్ గా వచ్చిన రాశి సినిమాలు పెద్దగా ఆడలేదు. 2019లో వెంకీ మామ తనకి లాస్ట్ హిట్. ప్రస్తుతం తెలుగు లో ఏ సినిమా చెయ్యట్లేదు ఈ హీరోయిన్. అయితే రాశి ఖన్నా బాలీవుడ్ లో మాత్రం రెండు సినిమాలు చేస్తుంది. ఈ మధ్యనే అక్కడ “ఫర్జి” అనే వెబ్ సిరీస్ లో షాహిద్ కపూర్ తో కలిసి నటించింది. ఇక హిందీలో రాశి ఖన్నా నటించిన ‘యోధా’ అనే సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ సినిమా లో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించాడు. తాజాగా రాశి ఖన్నా ఈ మూవీ కి డబ్బింగ్ చెప్తున్నానంటూ తన ఇన్స్టా లో స్టేటస్ పెట్టింది.
అయితే తెలుగు లో మంచి ఫాలోయింగ్ ఉన్న రాశి ఖన్నా, సడన్ గా హిందీ సినిమాలు ఎందుకు చేస్తుంది. అక్కడ ఆఫర్స్ వస్తున్నాయని చేస్తుందా? లేక అక్కడే చేయాలనీ డిసైడైందా ? తెలుగులో తన లాస్ట్ మూవీ థ్యాంక్ యూ. ఆ సినిమా ప్లాప్ అయింది. మరి రాశికి తెలుగులో ఆఫర్స్ రావట్లేదా? లేక వచ్చినా రిజెక్ట్ చేస్తుందా అన్నది తెలియదు కానీ, మంచి మార్కెట్ ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ ని వదిలేసి హిందీలో మూవీస్ చేయడమేంటనీ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
For More Updates :
Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News