పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘కొమురం పులి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది నిఖిషా పటేల్. 2010లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. దీంతో నిఖీషా పటేల్కి తెలుగులో అంతగా గుర్తింపు రాలేదు. ‘కొమురం పులి’ సినిమా తరువాత తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అవి కూడా ఆశించిన మేరకు ఆకట్టుకోలేదు. దీంతో ఆమెకు ఆఫర్లు అంతగా రాకపోవడంతో తెలుగు పరిశ్రమకి దూరమైంది.
కొమురం పులి సినిమాతో గుర్తింపు పొందిన నిఖిషా పటేల్ కు కన్నడ, తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి వరుస ఆఫర్లు వచ్చాయి. అక్కడ కూడా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఏమైందో ఏమో అకస్మాత్తుగా చిత్ర పరిశ్రమకి దూరం అయింది. ప్రస్తుతం నిఖిషా పటేల్ విదేశాల్లో ఉంటుంది. ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో ఆమె అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.
గతంలో ఆమె సోషల్ మీడియాలో ఓ వార్తను పంచుకుంది. తాను ఓ విదేశీయుడితో ప్రేమలో ఉన్నానని, త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్టు వెల్లడించింది. బాయ్ ఫ్రెండ్ ఎవరని, అతన్ని చూపించాలని పదే పదే సోషల్ మీడియాలో అభిమానులు అడుగుతూనే ఉన్నారు. ఎట్టకేలకు తాజాగా తన ప్రియుడిని చూపించింది నిఖిషా పటేల్. దీపావళి పండుగ సందర్భంగా తన కాబోయే భర్త, బాయ్ఫ్రెండ్తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే అభిమానులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపింది నిఖిషా పటేల్.