Nayan-Vignesh : బాగానే ప్లాన్ చేశారు

తమిళ సినీ సెలబ్రిటీలు విగ్నేష్ శివన్, నయనతార ఈ ఏడాది జూన్ లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా నయనతార సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు విగ్నేష్ శివన్ వెల్లడించారు. ఆ ప్రకటన వెలువడిన క్షణం నుంచే ఈ జంటపై విమర్శలు ప్రారంభమయ్యాయి. నిబంధనల ప్రకారమే వారు సరోగసికి వెళ్లారా? అన్నదానిపై తమిళనాడు ప్రభుత్వం రంగంలోకి దిగింది.

మరోవైపు  కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 25 నుంచి సరోగసి రెగ్యులేషన్ యాక్ట్ ని అమల్లోకి తీసుకు వచ్చింది. కమర్షియల్ సరోగసిని ఈ చట్టం సంపూర్ణంగా నిషేధిస్తుంది. అయితే పెళ్లి అయిన ఐదేళ్ల తర్వాత మాత్రమే సరోగసికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వం విచారణ జరుపుతోంది.

ఈ విషయంపై ప్రభుత్వానికి సమర్పించిన అఫిడవిట్ లో నయనతార దంపతులు తాము ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ వివాహం చేసుకున్నామని వెల్లడించినట్లు తెలిసింది. సరోగసి వ్యవహారంలో తాము ఎక్కడా నిబంధనలని ఉల్లంఘించలేదని, అద్దె తల్లి కూడా తనకు దగ్గర బంధువేనని నయనతార తమిళనాడు ఆరోగ్య శాఖ అధికారులకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు. సరోగసి వివాదం నేపథ్యంలో ఈ విషయాన్ని తాజాగా నయనతార దంపతులు బయటపెట్టారు. తమ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ని కూడా అఫిడవిట్ కు జత చేసి పంపించారు. ఈ మొత్తం వ్యవహారంలో నయనతార దంపతులు ఆరేళ్ల క్రితమే రిజిస్ట్రేషన్ వివాహం చేసుకున్నామని చెప్పడం కొస మెరుపు. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు