మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష మూవీ తన రికార్డుల వేట కొనసాగిస్తుంది. ఏప్రిల్ 21 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే మంచి హిట్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు సాధిస్తుంది. విరూపాక్ష సినిమా 22 కోట్ల బిజినెస్ చేయగా ఆ టార్గెట్ ను కేవలం 4 రోజుల్లోనే బ్రేక్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికే 50 కోట్లకి పైగా వసూలు చేసిన ఈ చిత్రం డబుల్ స్పీడ్ తో దూసుకెళ్తుంది.
ఇక ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా శ్రీ వెంకటేశ్వర సీనిచిత్ర బ్యానర్ లో బి. వి. ఎస్. ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. కార్తీక్ దండు విరూపాక్ష సినిమాను డైరెక్ట్ చేయగా, అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించాడు.
తాజాగా విరూపాక్ష సినిమా మరో రికార్డు సాధించింది. ఓవర్సీస్ లో ఈ సినిమా వన్ మిలియన్ డాలర్ వసూళ్లను అందుకుంది. అందుకు ఈ సినిమా కు ఆరు రోజుల సమయం పట్టింది. అయితే సాయి ధరమ్ తేజ్ కు వన్ మిలియన్ డాలర్ వసూలు చేసిన ఫస్ట్ సినిమా ఇదే. ఇంతకు ముందు ఓవర్సీస్ లో ప్రతి రోజు పండగే సినిమా హాఫ్ మిలియన్ డాలర్స్ వసూలు చేయగా ఈ సినిమా దాన్ని డబల్ మార్జిన్ తో బ్రేక్ చేసింది. విరూపాక్ష మేకర్స్ తాజాగా ఓవర్సీస్ లో మరిన్ని థియేటర్లను ఆడ్ చేస్తున్నామని ప్రకటించారు. ఈ సినిమా కలెక్షన్లు ఎండ్ అయ్యే సరికి మరో రెండు లక్షల డాలర్ల వరకు వసూలు చేయొచ్చని అంటున్నారు. మరి సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ద్వారా రానున్న రోజుల్లో ఇంకెన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకుంటాడో చూడాలి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News