Meera Jasmine : అనారోగ్యంతో మీరా జాస్మిన్ తండ్రి కన్నుమూత

టాలీవుడ్ హీరోయిన్ మీరా జాస్మిన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ఫిలిప్ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. జోసెఫ్ వయసు 83 సంవత్సరాలు కాగా, వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనకు గత కొన్నేళ్లుగా ఇంట్లోనే చికిత్స కొనసాగుతున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం ఆయన స్వస్థలమైన ఎర్నాకులంలోని నివాసంలో తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. మీరా జాస్మిన్ తల్లి పేరు ఏలియమ్మ జోసెఫ్. ఏలియమ్మ, జోసెఫ్ ఫిలిప్ దంపతులకు నలుగురు పిల్లలు. అందులో మీరా జాస్మిన్ చిన్న కుమార్తె. జార్జ్ జాయ్, జిబి సారా జోసెఫ్, జెనీ సారా జోసెఫ్ మిగతా వాళ్లు. మీరా జాస్మిన్ తండ్రిని కోల్పోయింది అన్న విషయం తెలిసిన ఆమె అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. పలు వివాదాల కారణంగా మీరా జాస్మిన్ తన కుటుంబానికి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఈ బ్యూటీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది.

మీరా జాస్మిన్ పర్సనల్ లైఫ్…

సినిమాలతో ఎంత పాపులర్ అయ్యిందో వివాదాలతో కూడా అంతే పాపులర్ అయ్యింది మీరా జాస్మిన్. సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న సమయంలోనే దుబాయ్ కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైసన్ ను పెళ్లాడింది ఈ బ్యూటీ. 2014లో వీరి వివాహం జరగగా, దీనికి సంబంధించిన వివాదం అప్పట్లో తీవ్ర దుమారమే రేపింది. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన మీరా జాస్మిన్ ఆ తర్వాత తన భర్తకు విడాకులు ఇచ్చి వేరొక వ్యక్తితో సహజీవనం చేస్తుందని వార్తలు వచ్చాయి. ఆమె పర్సనల్ లైఫ్, వైవాహిక జీవితం గురించి ఎవరికీ పెద్దగా తెలీదు అని చెప్పాలి. మీరా జాస్మిన్ మొదటి నుంచి కూడా తన వ్యక్తిగత విషయాలను, కుటుంబ వ్యవహారాలను ఎక్కడా బయట పెట్టకపోవడం గమనార్హం. పెళ్లి తర్వాత తన కుటుంబంతో జరిగిన గొడవల కారణంగా ఆమె తల్లిదండ్రులకు దూరంగా ఉంటుందని వార్తలు వినిపించాయి. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన తండ్రిపై ఉన్న అభిమానాన్ని, ప్రేమను బయట పెట్టేది మీరా జాస్మిన్.

మీరా ప్రొఫెషనల్ లైఫ్…

2001లో లోహిత దాస్ దర్శకత్వ వహించిన సూత్రధారన్ అనే మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది మీరా జాస్మిన్. ఆ మూవీ తర్వాత తమిళ, మలయాళ భాషల్లో కూడా వరుస అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. టాలీవుడ్ లో ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన గుడుంబా శంకర్, రవితేజ హీరోగా నటించిన భద్ర, సీనియర్ హీరో రాజశేఖర్ తో కలిసి చేసిన గోరింటాకు సినిమాలు మీరా జాస్మిన్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాగే తమిళంలో విశాల్ తో ఆమె స్క్రీన్ షేర్ చేసుకున్న పందెం కోడి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ ఆ తర్వాత ఆరేళ్లకు మలకల్కు అనే మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్ గా తెలుగులో రిలీజ్ అయిన విమానం మూవీలో గెస్ట్ గా నటించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఇందులో సముద్రకని, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు మీరా జాస్మిన్ ది టెస్ట్ అని మూవీలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు