టాలీవుడ్ హీరో మంచు విష్ణు సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చాడనే చెప్పాలి. చివరగా 2019లో ఓటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విష్ణు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. మధ్యలో కన్నప్ప, మోసగాళ్లు సినిమా చేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ ఆ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు. కరోనా సమయంలో సినిమాలు చేయకపోయినప్పటికీ.. మధ్యలో మా ఎన్నికల పోరులో విజయం సాధించాడు. మంచు విష్ణు మా అధ్యక్షుడు అయిన తరువాత.. తాజాగా జిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు విష్ణు.
ఈ చిత్రం అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు చిత్ర బృందం ఓ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 05న విడుదల చేశారు. ట్రైలర్కి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి జారు మిటాయా అంటూ సాగే ఓ రొమాంటిక్ పాట లిరికల్ వీడియో విడుదల చేశారు. ఈ పాటను గణేష్ రాయగా.. సింహా, నిర్మల రాథోడ్ పాడారు. ఈ సాంగ్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేవిధంగా కనిపిస్తోంది.
ఈ పాటలో నువ్వొస్తానని నేను సిల్క్ చీర కట్టుకుంటిని అంటూ కొనసాగే ఈ పాట వినసొంపుగా ఉంది. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. విష్ణు, సన్నిలియోన్ లపై తెరకెక్కించిన పాట ఇది. విష్ణు, సన్నిలియోన్ డ్యాన్స్ మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందనే చెప్పాలి.