Malavika Nair: నేను దానికే ప్రాధాన్యం ఇస్తాను

మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక నాయర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె పుట్టి పెరిగింది ఢిల్లీలోని అయినప్పటికీ ఆ తర్వాత వీళ్ళ ఫ్యామిలీ కేరళకి మారడం జరిగింది. అందుకే ఈమె మలయాళం సినిమాల్లో నటించి బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈ బ్యూటీ చాలా ఫేవరెట్. సోషల్ మీడియాలో ఈ భామ ఫాలోయింగ్ వేరు. ఈ బ్యూటీ ఫోటో పోస్ట్ చేసిందంటే చాలు లైకులు, షేర్లు వెల్లువెత్తుతాయి.

క్షణాల్లో ఫోటోలు వైరల్ గా మారతాయి. ఈ ముద్దుగుమ్మ 2015లో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత కల్యాణ వైభోగం, మహానటి, విజేత, టాక్సీవాలా వంటి చిత్రాలతో హిట్లు అందుకుంది. ఇక తాజాగా మాళవిక “ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి అనే చిత్రంలో నటించింది.

ఈ చిత్రం ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది మాళవిక. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ” ఈ చిత్రంలో రొమాన్స్, ఎమోషన్స్ ఉంటాయి. ఇది లవ్ స్టోరీ అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. నాగశౌర్యతో ఇది నాకు రెండవ సినిమా. అవసరాల శ్రీనివాస్ గారి టేకింగ్ నాకు బాగా నచ్చింది. ఈ కథను సహజత్వానికి చాలా దగ్గరగా తీసుకుని వెళ్లారు. నేను ముందుగా కధకే ప్రాధాన్యత ఇస్తాను. నా సినిమాలకు సంబంధించిన నిర్ణయాలను నేనే తీసుకుంటాను. ఈ కథ వినగానే ఓకే చెప్పేశాను. ఈ సినిమాలో నా పాత్ర తప్పకుండా నాకు మంచి పేరును తీసుకువస్తుందని భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు