SidKiara: పెళ్లి తర్వాత మొదటిసారి కలిసి నటించనున్న జంట

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, హీరో సిద్ధార్థ్ మల్హోత్రాలు ఇటీవల మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7న రాజస్థాన్ లోని జై సల్మేర్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. బంధుమిత్రులు, అతికొద్ది మంది సినీ ప్రముఖుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది.

షేర్షా మూవీ నుంచి కియారా – సిద్ధార్థ్ మధ్య ప్రేమ చిగురించింది. అందుకే ఈ చిత్రంలో స్క్రీన్ మీద కూడా అంతగా కెమిస్ట్రీని పండించారు. అయితే వీరి ప్రేమను బహిరంగంగా ఎప్పుడు ప్రకటించలేదు. ఏకంగా పెళ్లి చేసుకున్న తర్వాత ఫోటోలను షేర్ చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక పెళ్లి అయిన తర్వాత ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కియారా అద్వానీ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. ఇక రియల్ లైఫ్ లో ఒకటైన కియారా – సిద్ధార్థ్ జంట త్వరలో రీల్ లైఫ్ లోను మరోసారి జంటగా కనిపించబోతున్నారట. ఈ రియల్ లైఫ్ జంటను వెండితెరపై కూడా జంటగా చూపించేందుకు రెడీ అవుతున్నారు స్టార్ మేకర్ కరణ్ జోహార్.

- Advertisement -

సిద్ధార్థ్ ప్రస్తుతం కరణ్ జోహార్ బ్యానర్ లో తెరకెక్కుతున్న “యోధా” లో నటిస్తున్నారు. ఇలా వీరిద్దరూ సౌత్, నార్త్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాలు పూర్తయిన వెంటనే ఈ కాంబో సెట్స్ మీదకు వెళ్లనుందట. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు