Prabhas : ఆదిపురుష్ పై మేకర్స్ కి నమ్మకం లేదా..?

ప్రభాస్ హీరోగా, ఓం రౌత్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఆదిపురుష్. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాకి సంబంధించి ఇటీవలనే రిలీజైన ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. గతంలో మూవీ టీం రిలీజ్ చేసిన టీజర్ తో సినిమాపై ఆశలు వదిలెనుకున్న ప్రేక్షకులు& అభిమానులు ట్రైలర్ చూసిన తరువాత, సినిమాపై నమ్మకంగా ఉన్నారు. అయితే ఈ నమ్మకం ప్రేక్షకులకే పరిమితమైంది. మేకర్స్ కి మాత్రం సినిమాపై నమ్మకం లేనట్టే తోస్తుంది.

వాల్మీకి రచించిన రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాలో శ్రీ రాముడిగా ప్రభాస్, సీతగా బాలీవుడ్ నటి కృతి సనన్ నటిస్తున్నారు. అయోధ్యని వదిలేసి రాముడు అరణ్యవాసానికి వెళ్లిన తర్వాత ఘట్టాన్ని సినిమాగా మలిచినట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. ఆకట్టుకునే డైలాగ్స్, మంచి విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న ఆదిపురుష్ ట్రైలర్ అన్ని భాషల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రిలీజైన 24 గంటలలోనే హిందీలో ఇంతకు ముందు ఉన్న అన్ని సినిమాల ట్రైలర్ రికార్డ్స్ ని బ్రేక్ చేసి నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది.

అయితే అంత బానే ఉంది, ఆదిపురుష్ ఇక రిలీజ్ అవడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో ఆదిపురుష్ టీం చేసిన సంచలన ప్రకటన సినిమాపై వారికి నమ్మకం లేనట్టు జనాల్లో కొత్త అనుమానాన్ని రేపుతోంది. అయితే సినిమా రిలీజ్ దగ్గరికొస్తుండటంతో సినిమా బుకింగ్ విషయంపై ఆదిపురుష్ టీం ఒక నిర్ణయాన్ని తీసుకుంది. పెటియం లో ఆదిపురుష్ సినిమా టికెట్స్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా టికెట్ ధర కూడా 100 రూపాయలు గా నిర్ణయించారట, అయితే అందరికి అందుబాటులో ఉండే ధరలతో, సినిమా ఎక్కువ మంది చూడటానికి వీలుగా ఉండేలా టికెట్స్ విషయంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారా లేక నిజంగానే సినిమా అవుట్ ఫుట్ ఏమైనా తేడా కొట్టిందా అనే అనుమానం కలుగుతుంది అందరిలో. మరి ఈ అనుమానాలకు ఫుల్ స్టాప్ పడాలంటే జూన్ 16 వరకు వెయిట్ చేయక తప్పదు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు