Mahesh Babu : ఆగిపోలేదు.. బ్రేక్ మాత్రమే

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం SSMB28. ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ ముగించుకుని ఈ చిత్రం షూటింగ్ ను ఇటీవలే ప్రారంభించింది. కానీ మహేష్ బాబు తల్లి ఇటీవల హఠన్మరణం చెందిన సంగతి తెలిసిందే. దీంతో SSMB28 చిత్రం షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. అయితే కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ లో, సోషల్ మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతుంది.

SSMB28 ఫైనల్ స్క్రిప్ట్ మహేష్ కు నచ్చలేదట. స్టోరీ లో పలు మార్పులు చేయాలని త్రివిక్రమ్ ను మహేష్ కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంతోనే SSMB28 షూటింగ్ ఆగిపోయిందనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి. మహేష్ సూచనలతో త్రివిక్రమ్ స్టోరీలో మార్పులు చేస్తున్నాడని, తన టీంతో త్రివిక్రమ్ ప్రస్తుతం అదే పనులో ఉన్నాడని టాక్ వచ్చింది. కానీ ఈ వార్తలు అన్నీ కూడా రూమర్స్ అని సమాచారం అందుతుంది.

మహేష్ బాబు తన తల్లి మరణం తర్వాత ఫ్యామిలీకి టైం కేటాయించడానికి లండన్ వెళ్లినట్టు తెలుస్తుంది. అందుకే SSMB28 షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడినట్టు టాక్. మహేష్ బాబు కూడా తాజాగా లండన్ నుంచి తిరిగి వచ్చినట్టు సమాచారం. దీంతో అతి త్వరలోనే కొత్త షెడ్యూల్ తో సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. కాగా మహేష్ పై త్రివిక్రమ్ ఇప్పటికే కొన్ని యాక్షన్ సన్నివేశాలను షూట్ చేసిన సంగతి విధితమే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు