టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడో సినిమా తెరకెక్కబోతుంది. ఇదివరకు అతడు, ఖలేజా సినిమాలు వీరి కాంబోలో వచ్చాయి. అతడు సినిమా సూపర్ డూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఖలేజా సినిమా కాస్త నిరాశ పరిచింది. తాజాగా వస్తున్న చిత్రానికి ఇంకా టైటిట్ ఖరారు కాలేదు. కానీ ప్రస్తుతం ‘SSMB28’ అనే పేరుతో ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసింది. రెండో షెడ్యూల్ కూడా ఇప్పటికే అయిపోవాల్సింది. కానీ మధ్యలో మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించడం, హీరోయిన్ పూజా హెగ్దే కాలికి గాయమవ్వడంతో షూటింగ్ వాయిదా పడింది.
పూజా హెగ్డే ప్రస్తుతం కాలు గాయానికి చికిత్స తీసుకుంటుంది. అందుకు సంబంధించిన ఫోటోని కూడా షేర్ చేసింది.సెకండ్ షెడ్యూల్ వాయిదా పడడంతో ఈ గ్యాప్ ను మహేష్ బాబు సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఈ సమయాన్ని జిమ్ లో వెచ్చించి ఫిట్ నెస్ ను పెంచుకుంటున్నాడు. జిమ్ లో కష్టపడుతున్న మహేష్ ఫోటోను తన భార్య నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై అభిమానులు పలు రకాలుగా స్పందింస్తున్నారు. ‘గ్రీక్ గాడ్’ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
కాగా, SSMB28 రెండో షెడ్యూల్ డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ రెండో షెడ్యూల్ లో మహేష్ పై యాక్షన్ సన్నివేశాలు చిత్రికరించబోతున్నారని సమాచారం. అందుకే మహేష్ ఫిట్ నెస్ పై ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. కాగా గతంలో సిక్స్ ఫ్యాక్ కోసం ఒకసారి ప్రయత్నిస్తే.. ముఖంలో మార్పులు వచ్చినట్టు స్వయంగా మహేష్ బాబు వెల్లడించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు మహేష్ కసరత్తుల వల్ల ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.