Event : నెక్ట్స్ గుంటూర్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ” లైగర్”. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీప్రియలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఓ కీలకపాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. భారీ అంచనాల నడుమ ఆగస్టు 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్ తో బిజీగా ఉంది లైగర్ టీమ్. ఇప్పటికే నార్త్, సౌత్ ప్రధాన నగరాల్లో లైగర్ ఈవెంట్స్ నిర్వహించి అభిమానులకు దగ్గరయ్యారు లైగర్ చిత్ర యూనిట్.

ఇటీవల లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వరంగల్ జిల్లాలో జరిపారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లోనూ ప్లాన్ చేశారు. ఆగస్టు 20న సాయంత్రం 5 గంటలకు గుంటూరు జిల్లా మోతడక ప్రాంతంలోని చలపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రౌండ్స్ లో లైగర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లుగా మేకర్స్ ట్విటర్ వేదిక ద్వారా అనౌన్స్ చేశారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తారనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే లైగర్ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు కొన్ని కట్స్ చెప్పి, U/A సర్టిఫికెట్ ఇచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు