Lakshmi Manchu : ట్రోల్స్ పై ఘాటు స్పందన

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని నటి మంచు లక్ష్మి. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ట్రోల్స్ కు గురయ్యే ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారంటే అది మంచు ఫ్యామిలీ అనే చెప్పాలి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సోషల్ మీడియాలో తనపై వచ్చే కామెంట్స్ పై స్పందించింది.

“నేను మాట్లాడే విధానం పై చాలా మంది విమర్శలు చేస్తూ ఉంటారు. వాళ్లు నాలా ఉండలేరు కాబట్టే నన్ను అవహేళన చేస్తున్నారు. ఇంట్లో కూర్చుని ఏ పని పాట లేకుండా కామెంట్ చేసే వాళ్ళని నేను పట్టించుకోను. ఈ భూమి మీద మనిషిగా పుట్టడం చాలా గొప్ప విషయం. నేను పుట్టినందుకు ఏదైనా గొప్పగా చేయాలనుకుంటున్నాను. అందుకు అనుగుణంగానే ఒక నటిగా విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటున్నాను. ఇప్పుడు అందరూ నాలాగే మాట్లాడుతున్నారు” అంటూ చెప్పుకొచ్చింది.

అలాగే “ప్రతి ఇంట్లోనూ ఓ మంచు లక్ష్మీ ఉంది. మా కుటుంబానికి సంబంధించిన విషయాలను మేము ప్రైవేట్ గానే ఉంచుతాము. సమయం వచ్చినప్పుడు మేమంతా ఒక్కటిగా కనిపిస్తాం. నాకు మనోజ్ కి మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో నిజం లేదు. మేము తరచూ కలుస్తూ ఉంటాం. మా ఇద్దరి కంటే విష్ణు విభిన్నమైన వ్యక్తి. విష్ణు ఎక్కువగా వర్క్, పిల్లలపైనే ఫోకస్ పెడతాడు. అందువల్లే మేము ముగ్గురం కలిసి ఎక్కువగా కనిపించం” అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు