Kiara Advani: కియారాకు సారీ చెప్పిన ఉపాసన!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య కొణిదెల ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ కి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకుంటారు. అలాగే పలు రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ మామకు తగ్గ కోడలు అనిపించుకుంటున్నారు.

అయితే తాజాగా ఉపాసన ఓ బాలీవుడ్ జంటకి సారీ చెప్పడం వైరల్ గా మారింది. బాలీవుడ్ నటి కియారా అద్వానీ – సిద్ధార్థ మల్హోత్రాలు మంగళవారం వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. జైసల్మేర్ లోని సూర్యఘడ్ ప్యాలెస్ లో కుటుంబ సభ్యులు, కొంతమంది స్నేహితుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది.

ఈ జంట పెళ్లి వేడుకకు ఆహ్వానం అందిన అతిధుల జాబితాలో కొంతమంది సన్నిహితులు మాత్రమే ఉన్నారు. అయితే కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా తమ వివాహ ఆల్బమ్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పోస్టుకు ఉపాసన కామెంట్ రాశారు. ” అభినందనలు. మీ జంట చాలా అందంగా ఉంది. మేము హాజరుకానందుకు క్షమించండి. మీ ఇద్దరికీ ఎల్లప్పుడూ మా ప్రేమ ఉంటుంది” అని పేర్కొన్నారు.

- Advertisement -

ఇక రామ్ చరణ్ సైతం.. ” ఇది స్వర్గంలో జరిగిన మ్యాచ్” అని కామెంట్ చేశారు. నిజానికి కియారాకు, రామ్ చరణ్ ఫ్యామిలీతో మంచి అనుబంధమే ఉంది. గతంలో రామ్ చరణ్ తో కలిసి వినయ విధేయ రామ చిత్రంలో కలిసి నటించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు RC15 చిత్రంలో మరోసారి చెర్రీకి జంటగా నటిస్తుంది.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు