సీనియర్ హీరోయిన్ ఖుష్బూ అందరికీ తెలిసే ఉంటుంది కదా.. ఆమె ప్రస్తుతం ఆకస్మాత్తుగా ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రి బెడ్పై నీరసంగా పడిపోవడంతో పాటు.. చేతికి సెలైన్ పెట్టుకొని కనిపించారు. ఈ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ చెప్పింది ఖుష్బూ. దాదాపు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఆమె అగ్ర కథానాయికగా రాణించింది.
ఆమె చాలా సినిమాల్లో సహాయ పాత్రల్లో కూడా నటించి మెప్పించింది. బుల్లితెరపై పలు షోలకు జడ్జీగా వ్యవహరిస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో కూడా చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడు చలాకీగా కనిపించే ఖుష్బూ ఉన్నట్టుండి ఆసుపత్రి బెడ్ పై గుర్తుపట్టలేనివిధంగా కనిపించడంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె కొద్ది రోజుల నుంచి వెన్నెముక సమస్య వేధిస్తోంది.
వెన్నెముక సమస్య వేధించడంతో ఆమెకు తాజాగా బోన్ సర్జరీ జరిగింది. ఆలస్యంగా దసరా శుభాకాంక్షలు చెబుతున్నందుకు క్షమించండి అని ఖుష్బూ ఓ ట్వీట్ చేసింది. రెండు, మూడు రోజుల్లోనే కోలుకుంటాను అని చెప్పింది ఖుష్బూ. తెలుగులో ఖుష్బూ చివరగా నటించిన చిత్రం ఆడాళ్లు మీకు జోహార్లు. శర్వానంద్, రష్మిక మందన్నా జంటగా నటించారు. ఈ సినిమాలో రష్మికకు తల్లిగా కనిపించింది. ప్రస్తుతం బుల్లితెరపై ఓ కామెడీ షోకు జడ్జీగా వ్యవహరిస్తున్నారు ఖుష్బూ.