Kangana Ranaut: డేటింగ్‌పై నోరు విప్పిన ఫైర్ బ్రాండ్… ఈమె సెలెక్షన్ మామూలుగా లేదుగా

బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్ అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా హీరోయిన్ కంగనా రౌనత్ పేరు చెప్పేస్తారు. ఆమె మాట్లాడింది అంటే… ఏదో ఒక కాంట్రవర్సీ ఉండాల్సిందే. అయితే ఆమె నుంచి వచ్చే సినిమాలు ఈ మధ్య కాలంలో అన్నీ డిజాస్టర్స్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఎమర్జిన్సీ సినిమాపై కంగనా చాలా హోప్స్ పెట్టుకుంది. ఆమె ప్రధాన పాత్ర చేస్తూ, దర్శకత్వం వహిస్తున్న మూవీ ఇది. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జిన్సీ నేపథ్యంలో ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ జూన్ 14న థియేటర్స్ లోకి రానుంది.

ఈ సినిమాకు సంబంధించి పోస్టర్స్‌ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తుంది. తాజాగా ఓ పోస్టర్ ను కంగన తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “భారతదేశంలో చీకటి క్షణాల వెనుక ఉన్న కథను తెలుసుకోండి. చరిత్రలో ఎక్కువ భయపడిన, భయపెట్టిన ప్రధానిని జూన్ 14న థియేటర్స్ లో చూడండి” అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ తో పాటు ఈమె షోషల్ మీడియాలో చేసిన మరో పోస్ట్ వైరల్ అవుతుంది.

కంగన గత కొన్ని రోజుల నుంచి ఒకరితో డేటింగ్ లో ఉంది అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెట్టింట్లో… ఈజ్ మై ట్రిప్ వ్యవస్థాపకుల్లో ఒకరు అయిన నిషాంత్ పిట్టితో డేటింగ్ అంటూ వస్తున్న వార్తల్లో నిజం ఉందా అని అడిగారు. దీనిపై కంగన స్పందించింది. నిషాంత్, తాను మంచి ఫ్రెండ్స్ అని, అతనికి ఇప్పటికే పెళ్లి అయిందని అన్నారు. దయచేసి ఇలాంటి రూమర్స్ ను నమ్మవద్దని వివరించింది. అయితే తాను కూడా ఒకరితో రిలేషన్ లో ఉన్నట్టు, అతనితో ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని త్వరలోనే బయటపెట్టబోతున్నట్టు చెప్పింది. అప్పటి వరకు వెయిట్ చేయాలని, తమను ఇబ్బంది పెట్టొద్దు అంటూ కోరింది.

- Advertisement -

డేటింగ్ విషయాన్ని కంగనా కన్ఫామ్ చేయడంతో, ఈ ఫైర్ బ్రాండ్ తో డేట్ చేస్తుంది ఎవరు? ఈమె సెలెక్షన్ ఎలా ఉందో అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు