Kangana Ranaut : వైరల్ ఫీవర్ తో వైరల్

బాలీవుడ్ నటి కంగనా రానౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 2009లో వచ్చిన ” ఏక్ నిరంజన్” సినిమాలో సమీరా గా కంగనా రానౌత్ నటించిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా యావరేజ్ టాక్ రావడంతో కంగనాకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ, బాలీవుడ్ లో మాత్రం మంచి స్థానాన్ని దక్కించుకుంది. ఓ ఫైర్ బ్రాండ్ పేరు కూడా తెచ్చుకుంది. కంగనా ఇప్పటికే తలైవి, మణికర్ణిక అనే పలు బయోపిక్ సినిమాలలో నటించారు. ఈ బాలీవుడ్ వివాదాల క్వీన్ తాజాగా ఇందిరాగాంధీ పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి ” ఎమర్జెన్సీ” అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రంతో కంగనా దర్శకురాలి అవతారం ఎత్తింది.

అయితే తాజాగా ఈ సినిమా చిత్రీకరణ సమయంలో కంగనా రనౌత్ డెంగ్యూ బారిన పడ్డారు. కంగనా తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురికాగా .. సోమవారం డెంగ్యూ ఉన్నట్లు తేలింది. తెల్ల రక్త కణాలు తగ్గిపోయి, జ్వరంతో బాధపడుతున్నా, కంగనా సినిమా పనుల్లో నిమగ్నమైంది. ఈ విషయాన్ని సొంత నిర్మాణ సంస్థ మణికర్ణికా ఫిలింస్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. చాలా మందికి కంగనా స్ఫూర్తి దాయకం అంటూ చేసిన పోస్ట్ చేసింది. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనికి కంగనా స్పందిస్తూ “థాంక్యూ టీం.. అయినా బాడీకి జబ్బు వచ్చింది కానీ నా ఆశయానికి కాదు” అంటూ రిప్లై ఇచ్చింది. అయితే కంగనా త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. అలాగే మరి కొందరు వైరల్ ఫీవర్ వచ్చినా, ఈ ఫైర్ బ్రాండ్ వైరల్ అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు