నందమూరి కుటుంబం నుంచి ఈతరం ఇండస్ట్రీకి చాలా తక్కువ కుర్రాళ్లు హీరోలుగా ఎదిగారు. సీనియర్ ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకోని వారి బాటలో నడుస్తూ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో జూ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ మంచి హీరోలుగా కెరీర్ ఎదిగారు. వీరితో పాటు తారక రత్న కూడా నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట్లో పలు సినిమాల్లో నటించిన తారక రత్న, ఇటీవల సినీ రంగానికి గుడ్ బై చెప్పి, ప్రత్యేక రాజకీయాల్లోకి వెళ్లారు.
అయితే తారక రత్న.. నారా లోకేష్ ప్రారంభించిన “యువ గళం” పాదయాత్రలో గుండె పోటుకు గురైయ్యారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని నారాయణ హృదయాలాంలో చికిత్స పొందుతున్నారు. దీంతో నందమూరి ఫ్యామిలీ మొత్తం ఆస్పత్రి వద్దే ఉన్నారు.
ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ నటిస్తున్న “అమిగోస్“. చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా నుంచి రెండో లిరికల్ సాంగ్ అయిన “ఎన్నో రాత్రులొస్తున్నాయి” పాట విడుదులను వాయిదా వేశారు. ఈ పాట బాల కృష్ణ నటించిన ధర్మ క్షేత్రం సినిమా లోనిది. తారక రత్న ఆరోగ్యం విషమంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు చిత్ర యూనిట్.
తారక రత్న హెల్త్ బులిటెన్:
ఇదిలా ఉండగా, బెంగళూర్ లోని నారాయణ హృదయాలాం తారక రత్న హెల్త్ బులిటెన్ విడులైంది. ఈ హెల్త్ బులిటెన్ ప్రకారం.. తారక రత్న ఇంకా ఐసీయూలోనే చికిత్స తీసుకుంటన్నాడు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
The song launch of #EnnoRatrulosthayi from #Amigos stands postponed to a later date.
Praying & Wishing Sri. Taraka Ratna Garu a speedy recovery. pic.twitter.com/UQAKDQTKNU
— Mythri Movie Makers (@MythriOfficial) January 28, 2023
For More Updates :
Check out Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News.