Devara :ఎన్టీఆర్ ని చూసి భయపడుతున్న జాన్వీ కపూర్!

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా రూపొందుతున్న తాజా చిత్రం దేవర. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ పాన్ ఇండియా మాస్ యాక్షన్ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిన్న రాత్రి 7 గంటలకు ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ చిత్రానికి “దేవర” అనే టైటిల్ ని పెట్టగా ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సముద్రపు అలలు ఎగిసిపడుతుండగా రాళ్లగుట్టలపై నిల్చోని చేతిలో బల్లెంతో చుట్టూ తాను తెగ నరికిన శత్రువుల శవాలతో జూనియర్ గెటప్ చాలా ఇంటెన్స్ గా ఉంది. నలుపు చొక్కా, పంచతో దర్శనం ఇవ్వడం ఎవరు ఊహించనిది. 2024 ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది దేవర.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ కారణంగా జాన్వీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందట. ఎన్టీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనే విషయం అందరికీ తెలిసిందే. నటనలో అతనికి సాటి లేదు అనేట్లుగా చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఎన్టీఆర్. సింగిల్ టేక్ లో భారీ సంభాషణలు చెప్పడమే కాదు.. అదిరిపోయే స్టెప్పులు వేయగలిగే హీరో కూడా. ఆయనతో పనిచేసిన ప్రతి దర్శకుడు చెప్పే మాట ఇది. ఇదే ఇప్పుడు జాన్వీ కపూర్ కి పెద్ద సమస్యగా మారిపోయిందట. ఎన్టీఆర్ వేగాన్ని ఆమె అందుకోలేకపోతుందట. ఆయన నటనని లైవ్ గా చూసి భయపడి అప్పటివరకు చెప్పాలనుకున్న డైలాగ్స్ ని కూడా మరిచిపోతుందట. అందువల్ల ఎక్కువగా టేక్స్ తీసుకోవడంతో కొరటాల శివ చిరాకు పడుతున్నారట. దీంతో జాన్వి కపూర్ షూటింగ్ కి రావడానికి కూడా భయపడుతుందని సమాచారం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు