Prabhas : గ్యాప్ పెరిగింది

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు చకచకా సినిమాలు పూర్తి చేసి వదిలిన ప్రభాస్.. జక్కన్నతో బాహుబలి మొదలుపెట్టిన తర్వాత వ‌చ్చే సినిమాల‌న్నిటికీ చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. ఇటీవల ప్రభాస్ సాహో, రాధేశ్యామ్ సినిమాల ఫలితాలు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయి.

ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తీస్తున్న ఆది పురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో పాన్ వరల్డ్ మూవీ, సందీప్ రెడ్డి వంగతో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదేవిధంగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో కూడా డార్లింగ్ ఓ మూవీ చేయ‌నున్నాడు.

ఇక ఈ సినిమాలన్నింటినీ లైన్లో పెట్టిన ప్రభాస్.. తాజాగా మరో సినిమాకి ఓకే చేసినట్లుగా సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. ప్రభాస్ మరో బాలీవుడ్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రిమూవీస్‌తో కలిసి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనుందట. పఠాన్, వార్ మూవీస్ ఫేమ్ సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ భారీ యాక్షన్ సినిమాకి ప్రభాస్ ఓకే చేసినట్లుగా బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే మైత్రి, ప్రభాస్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలలో వాస్త‌వం ఎంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు