Vyavastha: ఆహాలో హెబ్బా పటేల్ జోరు మాములుగా లేదు

అలా ఎలా సినిమాతో తెలుగు తెరకి పరిచమైన హెబ్బా పటేల్, ఆ తరువాత వచ్చిన కుమారి21ఎఫ్ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో సంచలనం విజయం సాధించింది.

అయితే కుమారి21ఎఫ్ సినిమా తరువాత స్టార్ హీరోయిన్ అయిపొతుందేమో అనుకున్న హెబ్బా.. మీడియం రేంజ్ సినిమాల మోజులో పడి పెద్ద సినిమాలలో అవకాశాలని కోల్పోయింది. అందుకే ఆమెకి కుమారి21ఎఫ్ సినిమా తరువాత నుంచి, నిఖిల్ హీరోగా వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాని మినహాయిస్తే సరైన హిట్ ఏది లేదు. దాంతోపాటు హెబ్బా పటేల్ కి తెలుగులో అవకాశాలు కూడా బాగా తగ్గాయి. ఇక చేసేదేమి లేక ఐటెం సాంగ్స్ చేయడానికి కూడా హెబ్బా ఒకే చెబుతూ కెరీర్ ని నెట్టుకొచ్చింది.

అయితే గతంలో హెబ్బా పటేల్ “ఓదెల రైల్వే స్టేషన్” అనే ఒక సినిమాలో నటించింది. ప్రముఖ డైరెక్టర్ సంపత్ నంది సమర్పణలో వచ్చిన ఈ సినిమా ఆహా లో రిలీజయ్యింది. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఆహాలో మంచి వ్యూవర్ షిప్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాని రీసెంట్ గానే తమిళ్ డబ్ చేసి రిలీజ్ చేయగా, అతి తక్కువ సమయంలోనే తమిళ్ లో కూడా ఈ సినిమా 20 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో రికార్డ్ సృష్టించింది. ఈ విషయాన్ని డైరెక్టర్ సంపత్ నంది ఆయన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నాడు. అలాగే హెబ్బా పటేల్ రీసెంట్ గా వ్యవస్థ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ప్రస్తుతం జీ5లో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరిస్ కూడా రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ ని దక్కించుకుంటుంది. దీన్ని బట్టి చూస్తే హెబ్బా పటేల్ ఓటిటి వల్ల మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్టు అనిపిస్తోంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు