Pawan Kalyan : ఇక షురూ

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం హరి హర వీరమల్లు. 2020 సెప్టెంబర్ లో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాలేదు. కరోనా మహమ్మారి ప్రభావంతో పాటు పవన్ కళ్యాణ్ రాజకీయ కారణాలు, దీనికి ముందే కమిట్ అయిన సినిమాల కారణంగా ఈ భారీ చిత్రం షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. కాగా ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. రూ. 150 కోట్ల తో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఎ. ఎం రత్నం,దయాకర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే.. ఇటీవల మూవీ యూనిట్ రాబోయే షెడ్యూల్ కోసం వర్క్ షాప్ నిర్వహించారు. దీనికి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో పాటు నటీ నటులు అందరూ కూడా పాల్గొన్నారు. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. ఈ కొత్త షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అందుకోసం ఆయన కూడా షూటింగ్ లో నేటి నుంచి పాల్గొననున్నారు.

అయితే పవన్ గత కొన్ని రోజుల నుంచి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నాడు. దీంతో హరి హర వీరమల్లు ప్రాజెక్ట్ పక్కన పడే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. కానీ, ఈ సినిమా పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడట. అందుకే రాజకీయంగా ఎంత బిజీ ఉన్నా.. షూటింగ్ లో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు