Guntur Kaaram : “గుంటూరు కారం” మూవీపై నెగిటివ్ ప్రచారం… నలుగురు అరెస్ట్

Guntur Kaaram : “గుంటూరు కారం” మూవీ రిలీజ్ కు ముందు ఎంత వివాదాస్పదమైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే రిలీజ్ అయిన తర్వాత ఎంత నెగెటివిటీ వచ్చిందో కూడా అందరికీ తెలిసిందే. అయితే ఆ నెగిటివిటీకి కారకులైన నలుగురిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ వాళ్ళు ఎవరు? అంటే…

జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సినిమాలలో “గుంటూరు కారం” ఒకటి. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందిన ఈ మూడవ చిత్రం భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చింది. కానీ ఆశించిన విధంగా కంటెంట్ లేకపోవడంతో ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. అయినప్పటికీ డివైడ్ టాక్ తో నిర్మాతలను కొంతవరకు గట్టెక్కించింది. అయితే రిలీజ్ కు ముందు “హనుమాన్” అనే చిన్న సినిమాతో క్లాష్, థియేటర్ల సమస్య కారణంగా “గుంటూరు కారం” మూవీ టీంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

అలాగే మూవీ సాంగ్స్ విషయంలోనూ చిత్ర యూనిట్ కు, మహేష్ ఫ్యాన్స్ కు మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఇన్ని నెగిటివిటీల మధ్య థియేటర్లోకి వచ్చేసిన “గుంటూరు కారం” సినిమాకు మొదటి షో నుంచే టాక్ కూడా నెగిటివ్ గా వచ్చేసింది. టికెట్స్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో ఈ సినిమాకు 0/10 రేటింగ్ ను దాదాపు 70 వేల మంది ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా గమనించి ఎవరో కావాలనే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారన్న విషయాన్ని పసిగట్టిన “గుంటూరు కారం” నిర్మాత పోలీసులను ఆశ్రయించారు. సినిమాకు జీరో రేటింగ్ ఇచ్చి నెగిటివ్ ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

ఈ నేపథ్యంలోనే తాజాగా పోలీసులు “గుంటూరు కారం” మూవీపై నెగిటివ్ ప్రచారం చేసిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌లు, యూట్యూబ్‌లలో “గుంటూరు కారం” గురించి ప్రతికూల ప్రచారం చేసినందుకు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మరి ఈ విచారణలో “గుంటూరు కారం” మూవీకి వీళ్ళు ఎందుకు నెగిటివ్ ప్రచారం చేశారు? ఈ నలుగురు వెనక ఉన్నది ఎవరు? ఎవరైనా కావాలనే ఇదంతా చేశారా లేక వాళ్ళు మహేష్ బాబు మీద ఉన్న హేట్ తోనే ఇంత నెగెటివిటీని క్రియేట్ చేశారా? అన్న విషయం వెళ్లడయ్యే అవకాశం ఉంది.

కాగా అరెస్టు అయిన ఆ నలుగురు ఎవరు అన్న విషయం ఇంకా తెలియ రాలేదు. ఇక ఈ నెగిటివిటీ కారణంగా “గుంటూరు కారం” మూవీకి దర్శకత్వం వహించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ తర్వాత బయట కనిపించలేదు. మరోవైపు నిర్మాతలు స్క్రీన్ పై మహేష్ బాబు ఆయన అభిమానులు ఆశించిన విధంగా కనిపించారని, అదంతా దర్శకుడి వల్లే సాధ్యం అయ్యిందంటూ హీరోకు, అలాగే దర్శకుడికి క్రెడిట్ ఇచ్చారు. మరోవైపు మహేష్ బాబు ఈ మూవీ ఫలితాన్ని పక్కన పెట్టేసి రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు