Adavi Sesh: మేజర్ ని ప్రశంసించిన మాజీ రాష్ట్రపతి

సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా 26/11 ఎటాక్ ముంబై దాడుల నేపథ్యంలో తెరకెక్కిన పేట్రియాటిక్ మూవీ మేజర్. మహేష్ బాబు ఎంటెర్టైన్మెంట్ బ్యానర్ లో “సూపర్ స్టార్ మహేష్ బాబు” ఈ సినిమాను స్వయంగా నిర్మించడం జరిగింది. శశి కిరణ్ టిక్కా దర్శకత్వం వహించిన మేజర్ పాన్ ఇండియా మూవీగా 2022 జూన్ 3 న విడుదల అయి ఘన విజయం సాధించింది. అంతే కాదు పలు, అవార్డులు రివార్డులు కూడా సాధించింది. ఈ చిత్రం లో హీరోగా నటించిన అడవి శేష్ తన కెరీర్లోనే ఉత్తమ నటన ని ప్రదర్శించడంతో పాటు, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు.

ఇక మేజర్ పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ప్రదర్షింపబడింది. తాజాగా మేజర్ సినిమాకు, చిత్ర యూనిట్ కి మరో గౌరవం దక్కింది. భారత మాజీ రాష్ట్రపతి అయిన రామ్ నాథ్ కోవింద్ ఈ సినిమాను వీక్షించడం జరిగింది. చూసిన వెంటనే చిత్ర యూనిట్ ని తన ఇంటికి పిలిపించుకుని అభినందించారు ఆయన. ఈ విషయాన్నీ మేజర్ హీరో అడవిశేష్ ట్విట్టర్ వేదికగా తన అనుభవాలను పంచుకున్నాడు.

మరి కొద్దీ రోజుల్లో మేజర్ విడుదలై సంవత్సరం పూర్తి అయిపోతుంది. భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గారి ప్రశంస ఎంతో సంతోషాన్నించిందని, తన జీవితంలో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ లాంటి మంచి రోల్ ని ఇచ్చినందుకు నిర్మాత మహేష్ బాబుకు, అలాగే ఈ చిత్ర డైరెక్టర్ శశి కిరణ్ టిక్కా కు అడవిశేష్ ధన్యవాదాలు తెలిపాడు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు