టాలీవుడ్ యంగ్ హీరోల్లో అల్లు శిరీష్. ఇప్పటివరకు శిరీష్ నటించిన ఒక్క సినిమా కూడా సరైన హిట్ పడలేదు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా తన చిన్న కుమారుడికి సరైన హిట్ పడాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు. స్వయంగా ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ‘ఊర్వశివో రాక్షసివో’ అనే టైటిల్ ని ఇటీవలే ఖరారు చేశారు.
ఇందులో అల్లు అశిష్, అను ఇమ్మాన్యుల్ జంటగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ ఈ సినిమాపై మంచి అంచనాలను పెంచింది. ఈ చిత్రానికి విజేత సినిమా దర్శకుడు రాఖేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి దీంతననా.. అనే మొదటి పాట విడుదల చేశారు. అనగనగా కనులే కలగనగా అంటూ ఈ పాట కొనసాగుతుంది.
పూర్ణచారి సాహిత్యం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ పాట యువతకి తెగ నచ్చుతుందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి విజయ్-విరాజ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతం సమకూర్చుతున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, పోస్టర్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి.